Kuldeep Yadav: బాగా ఆడుతున్నాడని కుల్దీప్ను పాక్ జట్టుకు సెలెక్ట్ చేయలేం కదా.. ఇంజమామ్ చమత్కారం
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ (Pakistan) జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ పాకిస్థాన్ స్పిన్నర్ల గణాంకాలను టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) గణాంకాలతో పోల్చాడు. దీనికి పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam ul Haq) ఫన్నీగా సమాధానమిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) కోసం పాకిస్థాన్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియాకప్లో టీమ్ఇండియా (team india)తో మ్యాచ్లో గాయపడిన యువ పేసర్ నసీమ్ షాకు చోటు దక్కలేదు. త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న అతడు కోలుకోవడానికి 3-4 నెలల సమయం పట్టనుంది. నసీమ్ స్థానంలో హసన్ అలీ జట్టులోకి వచ్చాడు. మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఒసామా మీర్లను స్పిన్నర్లుగా తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల ముగిసిన ఆసియా కప్లో పాక్ స్పిన్నర్లు ఆశించిన మేరకు ప్రభావం చూపలేకపోయారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో పాక్ జట్టును వెల్లడిస్తున్న క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఓ రిపోర్టర్ పాకిస్థాన్ స్పిన్నర్ల గణాంకాలను టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) గణాంకాలతో పోల్చాడు. దీనికి పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam ul Haq))ఫన్నీగా సమాధానమిచ్చారు.
వన్డేల్లో పాక్ స్పిన్నర్లు మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ కంటే కుల్దీప్ యాదవ్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని ఇంజమామ్-ఉల్-హక్ అంగీకరించారు. అయితే, గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని తాను కుల్దీప్ యాదవ్ను పాకిస్థాన్ జట్టుకు ఎంపిక చేయలేను కదా, అతడు మరో జట్టులో ఉన్నాడు.. అదే మాకు సమస్య అంటూ చమత్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు:
బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ఖాన్ (వైస్ కెప్టెన్), రిజ్వాన్, ఇమాముల్ హక్, షఫీఖ్, షకీల్, ఫకార్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్, ఆగా సల్మాన్, షహీన్షా అఫ్రిది, ఒసామా మీర్.
పాక్ జట్టుకు వీసా సమస్యలు!
వన్డే ప్రపంచకప్లో భాగంగా సెప్టెంబర్ 29న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్కు చేరుకునే ముందు పాక్ జట్టు దుబాయ్ వెళ్లాల్సి ఉంది. అయితే, భారత్కు రావడానికి పాక్ ఆటగాళ్లకు ఇంకా వీసాలు రాకపోవడంతో ఆ జట్టు దుబాయ్ ట్రిప్ రద్దు అయింది. ప్రపంచకప్నకు ముందు ఆటగాళ్ల మధ్య స్నేహాపూర్వక వాతావరణం మెరుగుపడేందుకు ఈ ట్రిప్నకు ప్లాన్ చేశారు. భారత్లో జరిగే ప్రపంచకప్లో పాల్గొనేందుకు వస్తున్న తొమ్మిది జట్లలో పాకిస్థాన్కు మినహా అన్ని టీమ్లకు వీసాలు వచ్చాయి. వీసాల సమస్యలు పరిష్కారం కాగానే పాక్ జట్టు వచ్చేవారం కరాచీ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకునే అవకాశముంది. 2012-13 తర్వాత పాక్ టీమ్ భారత్కు రానుండటం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్కు చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యాఖ్యానించాడు. -
Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్
వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణాలతో దీపక్ చాహర్ (Deepak Chahar) ఆసీస్తో ఐదో టీ20లో ఆడలేదు. దీంతో అభిమానులంతా ఏమైందోనని కంగారు పడ్డారు. దానికి దీపక్ చాహర్ స్పందించాడు. -
IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్.. వారిద్దరి మధ్య డైరెక్ట్ షూటౌట్: భారత మాజీ క్రికెటర్
భారత జట్టులో (Team India) ఓపెనర్లకు కొదవేం లేదు. అయితే, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తికరం. టీ20 వరల్డ్కప్లో రోహిత్ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. దీంతో అతడికి జోడీగా ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ ఇద్దరికి దక్షిణాఫ్రికాతో సిరీస్ అత్యంత కీలకం కానుంది. -
Lionel Messi: టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా మెస్సీ
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టైమ్ పత్రిక అతడిని ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్గా ప్రకటించింది. -
Team India: ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్
వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2024) భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ నాయకత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి కెప్టెన్సీని ధోనీతో పోలుస్తూ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
T20 WC 2024: టీ20 ప్రపంచకప్లో రోహితే సారథి!
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు సహా బీసీసీఐలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. -
INDw vs ENGw: భారత అమ్మాయిలకు సవాల్
భారత మహిళల క్రికెట్ జట్టుకు సవాల్.. బలమైన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు.. -
Pro Kabaddi League: విజృంభించిన సోను
రైడర్ సోను జగ్లాన్ (10 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ సాధించింది. జోరు కొనసాగిస్తూ మంగళవారం 39-37లో యు ముంబాపై విజయం సాధించింది. మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో ఆరంభంలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. -
junior hockey wc: అర్జీత్ హ్యాట్రిక్
జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు అదిరే ఆరంభం. అర్జీత్ సింగ్ హుందాల్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో మంగళవారం పూల్-సి మ్యాచ్లో 4-2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్దే జోరు. 11వ నిమిషంలో అర్జీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. -
భారత్కు మూడు స్వర్ణాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాయల్, నిషా, ఆకాన్ష పసిడి పతకాలతో మెరిశారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 52 కేజీల ఫైనల్లో నిషా 5-0తో ఫరినాజ్ (తజికిస్థాన్)ను చిత్తుగా చేయగా..70 కేజీల తుదిపోరులో ఆకాన్ష అంతే తేడాతో తైమజోవా (రష్యా)ను ఓడించింది. -
Sourav Ganguly: కోహ్లీని నేను తప్పించలేదు
టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పునరుద్ఘాటించాడు. టీ20 ప్రపంచకప్ (2021) అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడికి, గంగూలీకి మధ్య వైరం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమణ
విజయ్ హజారె ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ నుంచి హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమించాయి. పేలవ ప్రదర్శనతో గ్రూపు దశను దాటలేకపోయాయి. ఏడు మ్యాచ్ల్లో నాల్గింట్లో గెలిచి.. మూడింట్లో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో గ్రూపు-బి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. -
Sports News: ఆ ఒక్క అథ్లెట్ డోపీనే
ఈ ఏడాది సెప్టెంబరులో సంచలనం సృష్టించిన దిల్లీ అథ్లెటిక్ మీట్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబరు 26న 100 మీ ఫైనల్ నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్లంతా పారిపోయారు. -
IPL 2024 mini auction: ‘ఆ ఇద్దరి కోసం ముంబయి ఇండియన్స్ పోటీ పడుతోంది’
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్ కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్ ఈ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
-
TDP-Janasena: తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్కల్యాణ్ భేటీ
-
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
-
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
-
Raja Singh: కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్
-
Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్