Kuldeep Yadav: బాగా ఆడుతున్నాడని కుల్దీప్ను పాక్ జట్టుకు సెలెక్ట్ చేయలేం కదా.. ఇంజమామ్ చమత్కారం
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ (Pakistan) జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ పాకిస్థాన్ స్పిన్నర్ల గణాంకాలను టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) గణాంకాలతో పోల్చాడు. దీనికి పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam ul Haq) ఫన్నీగా సమాధానమిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) కోసం పాకిస్థాన్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియాకప్లో టీమ్ఇండియా (team india)తో మ్యాచ్లో గాయపడిన యువ పేసర్ నసీమ్ షాకు చోటు దక్కలేదు. త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న అతడు కోలుకోవడానికి 3-4 నెలల సమయం పట్టనుంది. నసీమ్ స్థానంలో హసన్ అలీ జట్టులోకి వచ్చాడు. మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఒసామా మీర్లను స్పిన్నర్లుగా తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల ముగిసిన ఆసియా కప్లో పాక్ స్పిన్నర్లు ఆశించిన మేరకు ప్రభావం చూపలేకపోయారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో పాక్ జట్టును వెల్లడిస్తున్న క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఓ రిపోర్టర్ పాకిస్థాన్ స్పిన్నర్ల గణాంకాలను టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) గణాంకాలతో పోల్చాడు. దీనికి పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam ul Haq))ఫన్నీగా సమాధానమిచ్చారు.
వన్డేల్లో పాక్ స్పిన్నర్లు మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ కంటే కుల్దీప్ యాదవ్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని ఇంజమామ్-ఉల్-హక్ అంగీకరించారు. అయితే, గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని తాను కుల్దీప్ యాదవ్ను పాకిస్థాన్ జట్టుకు ఎంపిక చేయలేను కదా, అతడు మరో జట్టులో ఉన్నాడు.. అదే మాకు సమస్య అంటూ చమత్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు:
బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ఖాన్ (వైస్ కెప్టెన్), రిజ్వాన్, ఇమాముల్ హక్, షఫీఖ్, షకీల్, ఫకార్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్, ఆగా సల్మాన్, షహీన్షా అఫ్రిది, ఒసామా మీర్.
పాక్ జట్టుకు వీసా సమస్యలు!
వన్డే ప్రపంచకప్లో భాగంగా సెప్టెంబర్ 29న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్కు చేరుకునే ముందు పాక్ జట్టు దుబాయ్ వెళ్లాల్సి ఉంది. అయితే, భారత్కు రావడానికి పాక్ ఆటగాళ్లకు ఇంకా వీసాలు రాకపోవడంతో ఆ జట్టు దుబాయ్ ట్రిప్ రద్దు అయింది. ప్రపంచకప్నకు ముందు ఆటగాళ్ల మధ్య స్నేహాపూర్వక వాతావరణం మెరుగుపడేందుకు ఈ ట్రిప్నకు ప్లాన్ చేశారు. భారత్లో జరిగే ప్రపంచకప్లో పాల్గొనేందుకు వస్తున్న తొమ్మిది జట్లలో పాకిస్థాన్కు మినహా అన్ని టీమ్లకు వీసాలు వచ్చాయి. వీసాల సమస్యలు పరిష్కారం కాగానే పాక్ జట్టు వచ్చేవారం కరాచీ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకునే అవకాశముంది. 2012-13 తర్వాత పాక్ టీమ్ భారత్కు రానుండటం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్