IPL 2022: నలుగురిని రిటెయిన్ చేసుకునేందుకు పాత ఫ్రాంచైజీలకు ఛాన్స్
ఐపీఎల్లో ఆటగాళ్ల రిటెయిన్, మెగా వేలంపై ప్రత్యేక చర్చ
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే సీజన్ నుంచి పది జట్లు పోటీపడనున్నాయి. అహ్మదాబాద్, లఖ్నవూ జట్లను బిడ్డింగ్ ప్రక్రియలో దాదాపు రూ.12,600 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్, ఆర్పీజీ గ్రూప్ దక్కించుకున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్కు సంబంధించి త్వరలో భారీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను (గతంలో ముగ్గురినే) తమ వద్దే ఉంచుకునేందుకు అవకాశం కల్పించింది. అలానే ఎనిమిది జట్లు రిటెయిన్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ విడుదల చేస్తుంది. మెగా వేలానికి ముందే ఆ జాబితా నుంచి ముగ్గురేసి క్రికెటర్లను ఎంచుకునే ఛాన్స్ను కొత్త జట్ల యాజమాన్యాలకు కల్పించింది. అయితే మెగా వేలం నిర్వహణ ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు.
రిటెయిన్ నియమాలపై ఐపీఎల్ నిర్వాహకులు, ఫ్రాంచైజీల మధ్య ఈ వారంలో అనధికారికంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రిటెయిన్లో రెండు రకాల కాంబినేషన్లను ఎంపిక చేసినట్లు సమాచారం. అందులో ముగ్గురు భారత క్రికెటర్లు.. ఒకరు విదేశీయుడు, రెండోది ఇద్దరేసి స్వదేశీ, విదేశీ క్రికెటర్లను అట్టిపెట్టుకునే అవకాశం. ముగ్గురు భారత క్రికెటర్లలో అందరూ క్యాప్డ్ లేదా అందరూ అన్క్యాప్డ్.. లేకపోతే రెండు రకాలవారినీ రిటెయిన్ చేసుకోవచ్చు. కొత్తగా రెండు జట్లు తీసుకునే ముగ్గురి ఆటగాళ్లలో ఇద్దరు భారతీయులు.. ఒకరు విదేశీ క్రీడాకారుడు అయి ఉండాలి. ఒకరిని రిటెయిన్ చేసుకోవాలంటే ఆటగాడి అభిప్రాయం కూడా కీలకం కానుంది. రిటెయిన్ చేసుకుంటే జట్టులో ఉండాలా.. మెగా వేలానికి వెళ్లాలా అనేది నిర్ణయించుకునే అవకాశం ఆటగాడికే ఉంది. ఫ్రాంచైజీని మార్చుకోవడం, వేలంలోకి వెళ్లాలనుకోవడం వంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. ఫ్రాంచైజీలు నవంబర్ నెలాఖరులోగా రిటెయిన్ జాబితాను బీసీసీఐకి అందివ్వాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్