IRE vs IND: ఐర్లాండ్తో మూడో టీ20 వర్షార్పణం.. సిరీస్ను కైవసం చేసుకున్న భారత్
ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీస్ని 3-0 క్లీన్స్వీప్ చేయాలనుకున్న టీమ్ఇండియా ఆశలపై వరుణుడు నీళ్లుచల్లాడు.
డబ్లిన్: ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీస్ని 3-0 క్లీన్స్వీప్ చేయాలనుకున్న టీమ్ఇండియా (Team India) ఆశలపై వరుణుడు నీళ్లుచల్లాడు. బుధవారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. దాదాపు మూడున్నర గంటలపాటు వర్షం కురిసింది. అనంతరం వర్షం తగ్గినా మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు తేల్చారు. దీంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్ సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్లో టీమ్ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
కీలకమైన వన్డే ప్రపంచకప్ ముందు ఐర్లాండ్ సిరీస్తో జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేసి మంచిఫామ్ని కనబర్చడం భారత్కు కలిసొచ్చే అంశం. రింకూ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇదే సిరీస్లో భారత్ తరఫున అరంగేట్రం చేసి సత్తాచాటారు. మూడో టీ20లో సంజు శాంసన్కు విశ్రాంతినిచ్చి వికెట్కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇస్తారనుకున్నా.. మ్యాచ్ రద్దవడంతో సాధ్యపడలేదు.
ఆసియా కప్తో తిరిగి బరిలోకి
ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్తో తిరిగి టీమ్ఇండియా మైదానంలోకి దిగనుంది. ఆరు దేశాలు పాల్గొనే ఆసియా కప్ టోర్నీలో సెప్టెంబరు 2న తన తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (PAK vs IND)తో ఆ మ్యాచ్లో భారత్ తలపడనుంది. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఆడుతుండగా... గ్రూప్ బిలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్