Hardik Pandya: హార్దిక్ నిర్ణయాలపై అజయ్ జడేజా ప్రశ్నలు.. స్పందించిన దినేశ్ కార్తిక్
ఐపీఎల్లో (IPL) తొలిసారి కెప్టెన్గా తన జట్టు గుజరాత్ టైటాన్స్కు (GT) టైటిల్ను అందించిన సారథి హార్దిక్ పాండ్య (hardik pandya). తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్కూ (ind vs sl) కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించగా.. రెండో టీ20లో మాత్రం 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్సీపరంగా హార్దిక్ తన సహచరుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీంతో హార్దిక్ నాయకత్వం మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్లను ఆకట్టుకొంటోంది. ఈ క్రమంలో ‘పాత పద్ధతి’ని మార్చాల్సిన అవసరం ఏముందని మాజీ ఆటగాడు అజయ్ జడేజా అడిగిన ఓ ప్రశ్నకు దినేశ్ కార్తిక్ సమాధానం ఇచ్చాడు.
చివరి ఓవర్ను అక్షర్ పటేల్ (తొలి మ్యాచ్)కు బంతినివ్వడం, రెండో మ్యాచ్ హర్షల్ స్థానంలో అర్ష్దీప్ను తీసుకోవడం వంటి నిర్ణయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘‘కొత్తగా వచ్చే ప్రతి కెప్టెన్ ఎందుకు పాత పద్ధతి మార్చాలని చూస్తుంటారు.? సిస్టమ్లోనే ఏమైనా సమస్య ఉందా..?’’ అని జడేజా క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ ప్రశ్నించాడు. దీనికి ప్రతిస్పందనగా.. గత కొంతకాలంగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోవడమే, మార్పులకు కారణం కావొచ్చని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు.
‘‘2013 నుంచి భారత్ ఐసీసీ ఈవెంట్లలో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అయితే 2014లో జట్టు పగ్గాలు చేపట్టిన వారు ఎలాంటి మార్పులు చేయలేదు. ఎందుకంటే అప్పటి వరకు వన్డే, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని వంటి టోర్నీల్లో విజయాలను నమోదు చేసి ఉన్నాం. అత్యుత్తమ ఆటగాళ్లు తమ ఆటతీరుతో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాం. అయితే ఆ తర్వాత నుంచి ఫలితాలు అనుకూలంగా రాలేదు. అందుకే జట్టు ఆడే విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది’’ అని డీకే వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.