Ashwin: కోహ్లీ కళ్లలో పవర్ కనిపించింది.. ఒక్క బాల్ ఆడటానికి ఏడు ఆప్షన్లు ఇచ్చాడు: అశ్విన్
గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ చివరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన హై డ్రామా గురించి అశ్విన్ (Ravichandran Ashwin) తాజాగా గుర్తు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్ (Pakistan)తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ (Team India) చివరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ కష్టకాలంలో విరాట్ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అశ్విన్ చివరి బంతికి సింగిల్ తీసి భారత్కు విజయాన్ని అందించాడు. అయితే, మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన హై డ్రామా గురించి అశ్విన్ (Ravichandran Ashwin) తాజాగా గుర్తు చేసుకున్నాడు. టీమ్ఇండియా గెలవడానికి ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా.. మహ్మద్ నవాజ్ వేసిన ఐదో బంతికి దినేశ్ కార్తిక్ స్టంపౌటయ్యాడు. దీంతో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. తక్కువ ఎత్తులో వచ్చిన చివరి బంతి వైడ్గా వెళ్తుందని అశ్విన్ ముందే ఊహించి పక్కకు జరిగాడు. ఆఖరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.
‘‘ఐదో బంతికి దినేశ్ కార్తిక్ ఔట్ కావడంతో అతడిపై నేను చాలా కోపంగా ఉన్నా. అతడి వల్ల నేను చాలా కష్టమైన పనిచేయాల్సి వచ్చింది. అభిమానులు చేస్తున్న నినాదాలను విన్నాను. ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నానో అప్పుడు అర్థమైంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి వాతావరణాన్ని, మద్దతును చూడలేదు. నేను చివరి బంతికి ఎదుర్కొవడానికి వెళ్లినప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) నా దగ్గరకు వచ్చాడు. ఆ బాల్ ఆడటానికి ఏడు ఆప్షన్లు ఇచ్చాడు. అన్ని షాట్లు ఆడే సామర్థ్యం ఉంటే ఎనిమిదో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేస్తా? అని నా మనసులో అనుకున్నా.
కోహ్లీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ కోహ్లీ కళ్లలో ఏదో పవర్ కనిపించింది. వేరే గ్రహం నుంచి వచ్చినవాడిలా కనిపించాడు. నవాజ్ వైడ్ వేయగానే ఈ మ్యాచ్లో విజయం సాధిస్తామనే నమ్మకం కలిగింది. రోజూ పడుకునే ముందు ఈ మ్యాచ్ గురించి ఆలోచిస్తూ అసలేం జరిగిందని వీడియో చూస్తాను. ఒకవేళ చివరి బంతి నా ప్యాడ్ను తాకి ఉంటే అక్కడితో నా కెరీర్ ముగిసిపోయేది. విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని అశ్విన్ వివరించాడు. ఇదిలా ఉండగా, 2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ