Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో (IND vs ENG) కుర్రాళ్లపై ఒత్తిడి లేకుండా చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. అరంగేట్రం చేసిన ఆటగాళ్లు తమ సత్తా చాటారు. మరీ ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం దక్కించుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. రోహిత్ నాయకత్వం వల్లే తన కెరీర్ మళ్లీ పుంజుకోగలిగిందని.. తమ మధ్య చక్కటి అనుబంధం ఉందని కుల్దీప్ అన్నాడు. మైదానంలో అతడేమన్నా సరే యువ క్రికెటర్లు బాధపడరని తెలిపాడు.
‘‘గతంలో ఎన్సీఏలో ఉన్నప్పుడు రోహిత్ అక్కడికి వచ్చాడు. నా బౌలింగ్ యాక్షన్ చూశాడు. కొన్ని మార్పులు చేసుకోవాలని సూచించాడు. ఇక మ్యాచుల్లో నేను స్లిప్లో ఉన్నప్పుడు బ్యాటర్ ఆఫ్ పిచ్ మీద వేసిన బంతిని ఎలా ఆడుతున్నాడనేది గమనించమని చెప్పాడు. తగినంత సమయం ఇవ్వకుండా బౌలింగ్ చేయాలని.. దాని కోసం మరింత శక్తివంతంగా మారాలని చెప్పాడు. ఒకవేళ బ్యాక్ఫుట్ మీదుగా ఆడేందుకు ప్రయత్నిస్తే... బంతి వికెట్లను గిరాటేసేలా లేదా ప్యాడ్లను తాకేలా బౌలింగ్ చేయడం ప్రారంభించాను’’ అని కుల్దీప్ చెప్పాడు.
‘‘రోహిత్తో నాకు మంచి అనుబంధం ఉంది. మా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటాం. అయితే, మైదానంలోకి దిగాక అవేవీ పట్టించుకోం. ఫీల్డింగ్ మిస్ అయినప్పుడు అనే మాటలకు బాధపడం. ఎందుకంటే బయట అతడు మాపై అలాంటి ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు ఏదైనా మ్యాచ్లో నా బౌలింగ్ గురించి ఏమీ సూచనలు చేయడం లేదు. ఎందుకంటే నేను ఆ స్థాయికి చేరానని అతడి భావన. కానీ, బ్యాటింగ్పై దృష్టిపెట్టమని చెబుతుంటాడు. నెట్స్లోనూ, టెస్టు సిరీస్ సందర్భంగా అదే విషయం గుర్తు చేశాడు. బ్రేక్ సమయంలో ఏం చేస్తే బాగుంటుందనే సూచనలు కూడా ఇచ్చాడు’’ అని కుల్దీప్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!