IND vs ENG: భారత్లో ఇంగ్లాండ్ పర్యటన.. కుక్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదు: మార్క్వా
ఇంగ్లాండ్ సిరీస్ను కోల్పోవడం ఆ జట్టు మాజీలకు రుచించడం లేదు. దీంతో తమ జట్టు ప్రదర్శన గురించి పెద్దగా మాట్లాడకుండా.. పర్యటన గురించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ చేతిలో ఇంగ్లాండ్ ఐదు టెస్టుల (IND vs ENG) సిరీస్ను కోల్పోవడంతో.. దానిని తక్కువ చేసేందుకు ఆ జట్టు మాజీలు తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్వా విస్మయం వ్యక్తం చేశాడు. అతడి నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదన్నాడు. జట్టును వెనకేసుకురావడం ఓకే కానీ.. పర్యటనను తక్కువ చేయడం మంచిది కాదని పేర్కొన్నాడు. ‘‘అలిస్టర్ కుక్ ఇలా స్పందిస్తాడని అనుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్గా దీనిపై శిక్షణ పొందే ఉంటావు’’ అని మార్క్వా వ్యాఖ్యానించాడు.
ఇంతకీ కుక్ ఏమన్నాడంటే..?
బజ్బాల్ క్రికెట్తో ప్రత్యర్థులను హడలెత్తిద్దామని వచ్చిన ఇంగ్లాండ్ చివరికి కుదేలైంది. దాదాపు నెల రోజులపాటు సాగిన పర్యటన గురించి టీవీల్లో కూర్చొని మాట్లాడటం తేలిగ్గానే ఉంటుందని అలిస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు. ‘‘టెస్టు సిరీస్ గురించి మాట్లాడేటప్పుడు కాస్త మానవత్వం అవసరం. మ్యాచ్ల భావోద్వేగాలపై మనం ఇక్కడ కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చు. నేనేమీ ఇంగ్లాండ్ను వెనకేసుకురావడం లేదు. దాదాపు ఎనిమిది వారాల పాటు బయటే గడిపారు. ఇదెంతో క్లిష్టమైన టూర్. వారేమీ రోబోలు కాదు. వారి ప్రదర్శన గురించి మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా ఇంటికి దూరంగా ఉండటమనేది ఒత్తిడితో కూడుకున్నదే’’ అని కుక్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!