Rohit Sharma - IPL 2024: ‘ఆ నిర్ణయం రోహిత్ శర్మ ఆటపై ప్రభావం చూపదు’
రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా తప్పించిన విషయం తెలిసిందే. అయితే, అది అతని ఆటతీరుపై ప్రభావం చూపదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ (Tom Moody) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2024కు రంగం సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచే ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్ కోసం సాధన మొదలెట్టారు. ఇక, లీగ్లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన ముంబయి ఇండియన్స్ భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్య (Hardik Pandya)కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్సీ తొలగింపు ప్రభావం రోహిత్ ఆటతీరుపై ఉంటుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ (Tom Moody) మాట్లాడాడు. కెప్టెన్సీ తొలగింపు రోహిత్ శర్మ బ్యాటింగ్పై ప్రభావం చూపదని అభిప్రాయపడ్డాడు.
‘‘రోహిత్ శర్మ సత్తా ఏంటో ఆటగాడిగా అతను ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. ఐపీఎల్లో కెప్టెన్సీ తొలగింపు రోహిత్ బ్యాటింగ్శైలిపై ప్రభావం చూపుతుందని నేనైతే అనుకోవడం లేదు. అతను స్వేచ్ఛగా తన సహజ శైలిలో ఆడతాడు’’ అని టామ్ మూడీ తెలిపాడు. స్టార్ ఆటగాళ్లు, ఫ్యాన్బేస్ ఎక్కువగా ఉన్న ముంబయి ఇండియన్స్ను నడిపించడం హార్దిక్ పాండ్యకు సవాలుతో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు. మార్చి 24న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో ముంబయి ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం