IND vs SA : రాహులూ..! ఇలా జరగాలంటే అదృష్టం ఉండాలయ్యా..
ఒక్కోసారి క్రికెట్లో చోటు చేసుకునే సంఘటనలు తమాషాగా ఉంటాయి. మైదానంలోని...
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి క్రికెట్లో చోటు చేసుకునే సంఘటనలు తమాషాగా ఉంటాయి. మైదానంలోని వారికి ముచ్చెమటలు పట్టించినా.. ప్రేక్షకులకు మాత్రం నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇలాంటిదే భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డేలో జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభమే దక్కింది. తొలి వికెట్కు కేఎల్ రాహుల్ (55), శిఖర్ ధావన్ (29) అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (0) డకౌట్గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రిషభ్ పంత్ (85), రాహుల్ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు.
అయితే రిషభ్, కేఎల్ రాహుల్ కుదురుకునేదుకు కాస్త సమయం తీసుకున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ వేసిన 15వ ఓవర్లో రనౌట్ నుంచి కేఎల్ రాహుల్ తప్పించుకున్నాడు. మహరాజ్ బంతిని మిడ్వికెట్ మీదుగా పంత్ ఆడాడు. వెంటనే పరుగు కోసం అవతలి ఎండ్లో ఉన్న రాహుల్ను పిలిచి వద్దని వారించాడు. అప్పటికే కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ ఎండ్ వద్దకు వెళ్లిపోయాడు. అయితే అక్కడ కాచుకుని ఉన్న టెంబా బవుమా వేగంగా కేశవ్ మహరాజ్కు బంతిని విసిరాడు. అయితే బంతి మిస్ అయి డీప్ వికెట్ వద్దకు వెళ్లిపోయింది. దీంతో వెంటనే రాహుల్ వెనక్కి పరుగెత్తి వచ్చేయడంతో బతికిపోయాడు. అప్పటికి కేఎల్ రాహుల్ స్కోరు 27 పరుగులు మాత్రమే. అయితే అర్ధ శతకం సాధించిన తర్వాత కేఎల్ రాహుల్ ఔటై పోగా.. సెంచరీ చేస్తాడని భావించిన పంత్ కూడా వెంటనే పెవిలియన్కు చేరిపోయాడు. కేఎల్ రాహుల్ రనౌట్ మిస్ అయిన వీడియోను ఓ అభిమాని షేర్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
-
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668