Mohammed Shami: ఇలానే మాట్లాడితే నిన్ను చూసి జనాలు నవ్వుకుంటారు.. పాక్ మాజీకి మహ్మద్ షమి పంచ్
ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో భారత్ విభిన్నమైన బంతులను ఉపయోగించి లబ్ధి పొందిందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఆరోపించాడు. దీనిపై భారత పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో భారత్ విభిన్నమైన బంతులను ఉపయోగించి మరింత ప్రయోజనం పొందిందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా ఇటీవల ఆరోపించాడు. దీనిపై భారత పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) స్పందించాడు. హసన్ రజా వాదనను చూసి తాను ఆశ్చర్యపోయానని షమీ పేర్కొన్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్లో ఎలా భాగమయ్యాడో తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నాడు. పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) కూడా హసన్ వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించాడు. మ్యాచ్లో జట్లకు బంతులను ఎలా కేటాయిస్తారు, బౌలర్లు వాటిని ఎలా ఎంచుకుంటారనే దానిపై వివరణ ఇచ్చాడు.
‘‘నేను ప్రపంచకప్లో మొదట జరిగిన మ్యాచ్ల్లో ఆడనప్పుడు కూడా ఈ ఆరోపణలను విన్నాను. నా తొలి మ్యాచ్లో 5 వికెట్లు తీశాను, తర్వాతి మ్యాచ్లో నాలుగు, ఆ తర్వాతి మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టాను. కొందరు పాక్ ఆటగాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. దానికి నేనేం చెయ్యగలను. సరైన సమయంలో రాణించే ఆటగాళ్లే అత్యుత్తమమని నేను భావిస్తున్నా. కానీ, మీరు వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. బంతి వేరే రంగులో కనిపిస్తోంది, వేరే కంపెనీ బంతులను వాడుతున్నారు, ఐసీసీ మీకు వేరే సెట్ బంతులను అందించిందని అంటున్నారు. మీ ఆలోచలను సరిదిద్దుకోండి. ఓ ఇంటర్వ్యూలో వసీమ్ భాయ్ (వసీమ్ అక్రమ్) దీని గురించి వివరించాడు. క్రికెట్ ఆడని వారు ఆ తర్వాత కూడా ఇలా మాట్లాడితే ఓ అర్థం ఉంది. కానీ, నువ్వు మాజీ ఆటగాడివి. ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకోవడం తప్ప ఇంకేమన్నా చేస్తారని నేను అనుకోను’’ అని షమీ పేర్కొన్నాడు.
2023 ప్రపంచకప్లో షమీ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అతడు ఏడు మ్యాచ్ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో ఏకంగా (7/57) గణాంకాలు నమోదు చేసి వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత