Shami: అసూయ పడేవాళ్లే ఎక్కువ.. యూపీ తరఫున క్రికెట్ ఆడకపోవడానికి కారణముంది: షమీ
భారత క్రికెట్లో షమీకి (Shami) ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపర జీవితాల్లో ఒడుదొడుకులు ఎదురైనా.. పట్టు విడవకుండా వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ ప్రపంచ కప్ ముందు వరకూ అతడు జట్టులోకి వస్తాడా? లేదా? అనే సందిగ్ధత ఉండేది. తొలి నాలుగు మ్యాచుల్లోనూ చోటు దక్కలేదు. ఆ తర్వాత చెలరేగిపోయాడు. కేవలం ఏడు మ్యాచుల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ షమీ (Shami) రికార్డు సృష్టించాడు. అయితే, దీని వెనుక ఎన్నో ఒడుదొడుకులను షమీ ఎదుర్కొన్నాడు. వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంలోనూ క్లిష్ట దశను చవిచూశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలాంటి సంఘటనల నుంచి బయటపడటంపై స్పందించాడు.
‘‘మీ జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూశారు. చాలాసార్లు మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పారు. ఆ దశ గురించి ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు?’’ అన్న ప్రశ్నకు షమీ సమాధానం ఇచ్చాడు.
‘‘కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నా. మాది సాధారణ కుటుంబం. మీరు ఎప్పుడూ అబద్దాలు చెబుతూ ఉంటే పరుగెడుతూనే ఉండాలి. కానీ, నేను సత్యాన్ని నమ్ముకున్నా. ఎప్పటికైనా అదే గెలుస్తుందని భావించేవాడిని. ఇక నా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలపై చాలా కలత చెందా. దాదాపు ఆరేడు రోజులు తీవ్రంగా మథన పడ్డా. ఆ సమయంలో నా కుటుంబం మద్దతుగా నిలిచింది. అప్పుడే.. నేను మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఉందనిపించింది.
జీవితంలో ఒడుదొడుకులు సర్వసాధారణం. మనం అనుకున్నది ఒక్కోసారి జరగకపోవచ్చు. నాపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి. అలాంటి సమయంలోనే ప్రమాదానికి గురయ్యా. అప్పుడు చాలా బాధపడ్డా. కానీ, కష్టాల నుంచి పారిపోలేదు. బయట నా గురించి ఏమైనా అనుకోవచ్చు. మనల్ని ప్రోత్సహించే వారి కన్నా కిందికి లాగేవాళ్లే ఎక్కువగా ఉంటారు. మనం విజయం సాధిస్తే అసూయ చెందేవారిని అస్సలు పట్టించుకోకూడదు’’ అని షమీ వ్యాఖ్యానించాడు.
నేను ఆడకపోవడానికి కారణమదే..
యూపీ నుంచి వచ్చిన తాను అక్కడ జట్టు తరఫున రంజీల్లో ఆడకపోవడానికి ప్రధాన కారణం.. బోర్డులోని వ్యక్తులే అని షమీ తెలిపాడు. నాణ్యమైన ప్రదర్శన ఇచ్చినా సరే రెండేళ్లపాటు జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టేశారని.. దాంతో వేరే రాష్ట్రానికి మారిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘నా సొంత రాష్ట్రం యూపీ నుంచి కాకుండా పశ్చిమ బెంగాల్ నుంచి దేశవాళీ క్రికెట్ ఆడా. నా ఎంపిక గురించి అప్పటి యూపీ చీఫ్ సెలక్టర్ ఇచ్చిన సమాధానం షాక్కు గురి చేసింది. నా ఎంపిక గురించి మా అన్నయ్య వెళ్లి చీఫ్ సెలక్టర్ను కలిశాడు. కానీ, అతడు మాత్రం ‘నా కుర్చీని కదిలించగలిగితేనే ఆ కుర్రాడు సెలక్ట్ అవుతాడు’ అని చెప్పడంతో మా అన్నయ్య దిగ్ర్భాంతికి గురయ్యాడు. ‘కుర్చీని కదల్చడమే కాదు.. తలకిందులు చేయగలను. ఆ పవర్ నాకుంది. కానీ, అలా రావాలని అనుకోవడం లేదు. సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేయాలి’ అని మా అన్నయ్య సమాధానం ఇచ్చాడు. దాంతో అప్పటి నుంచి యూపీ క్రికెట్లో భాగస్వామ్యం కాలేదు. 14 ఏళ్ల వయసులో కోల్కతాకు మారిపోయా’’ అని షమీ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్యాయత్నం..
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!