Siraj: రోటీ చేస్తుండగా చేతులు కాలాయి.. నాలుగేళ్ల కిందటే క్రికెట్ను వదిలేద్దామనుకున్నా: బర్త్డే బాయ్ సిరాజ్
టీమ్ఇండియా పేసర్ సిరాజ్ హైదరాబాద్కు వచ్చాడు. ఇవాళ అతడి 30వ బర్త్డే. ఈ సందర్భంగా బీసీసీఐ పోస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా పేసర్, హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ (Siraj) ఇవాళ 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) అతడికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. హైదరాబాద్లో తొలిసారి ఆడిన మైదానం వద్దకు వెళ్తే ఎంతో హాయిగా ఉంటుందని సిరాజ్ వ్యాఖ్యానించాడు. అలాగే నాలుగేళ్ల కిందటే క్రికెట్ను వదిలేద్దామని భావించినట్లు కూడా సిరాజ్ చెప్పాడు. బీసీసీఐ పోస్టు చేసిన ఆ వీడియో వైరల్గా మారింది.
‘‘మళ్లీ నా మాతృభూమి హైదరాబాద్కు వచ్చా. నేరుగా ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి ఈద్గా వెళ్తా. నేను ప్రపంచంలో ఎక్కడి వెళ్లినా రాని ప్రశాంతత ఈద్గాకు వెళ్తే వచ్చేస్తుంది. తొలిసారి నేను క్రికెటర్గా అక్కడే అడుగు పెట్టా. తొలినాళ్లలో క్యాటరింగ్ పనులు చేశా. మా నాన్న ఆటో రిక్షాతో కుటుంబాన్ని పోషించేవారు. దీంతో నేను ఆయనకు సాయంగా ఉండాలనుకున్నా. మా ఇంట్లో వాళ్లు చదువుకోమని గట్టిగా చెప్పారు. కానీ, నాకేమో క్రికెట్ అంటే చాలా ఇష్టం. పని చేస్తూ 200 సంపాదించినా సంతోషపడేవాడిని. అందులో 50 రూపాయలు ఉంచుకుని.. మిగతావి ఇంట్లో ఇచ్చేవాడిని. అయితే, ఓసారి రోమాలీ రోటీ చేస్తుంటే చేతులు కాలాయి. ఇలాంటి కష్టాలను ఎదుర్కొని ఇక్కడి వరకు రాగలిగా.
తొలి నాళ్లలో టెన్నిస్ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిని. అదే నాకు ఎంతో సాయం చేసింది. పేస్ను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడింది. కఠినంగా శ్రమిస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. అది వెంటనే రాకపోయినా.. కష్టపడుతూనే ఉండాలి. ఏదొక రోజు మంచి జరుగుతుంది. ఇదే నమ్మి ఆచరించా. నాలుగేళ్ల కిందట నేను క్రికెట్ను వదిలేద్దామని ఓ దశలో భావించా. విజయవంతం కాకపోతే అదే నాకు చివరి సంవత్సరం అనుకున్నా. కానీ, తర్వాత ఫామ్లోకి రావడంతో జట్టులో స్థానం నిలబెట్టుకోగలిగా ’’ అని సిరాజ్ తెలిపాడు. ఇంగ్లాండ్తో సిరీస్ ఆడిన సిరాజ్.. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 సీజన్లో ఆడనున్నాడు. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగుతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్