PCB: ధోనీ ఆడుతున్నాడుగా.. మరి పీసీబీకి ఏమైంది: పాక్ బోర్డుపై విమర్శలు
ఆసియా కప్ టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు చివరి మ్యాచ్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాక్ జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఆడుతోంది..........
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు చివరి మ్యాచ్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాక్ జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో జరగబోయే ప్రపంచకప్ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొద్దిరోజుల క్రితమే తమ జట్టును ప్రకటించింది. అయితే, సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ను వరల్డ్కప్కి ఎంపిక చేయకపోవడాన్ని మాజీ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ తప్పుబట్టాడు. ఎంపిక ప్రక్రియను నిందిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు.
‘జట్టు సభ్యులపై ఇష్టాయిష్టాల గురించి గత నాలుగైదు ఏళ్లుగా మాట్లాడుతున్నా. దేశవాళీ క్రికెట్లోనూ అదే జరుగుతోంది. ఇలాంటివి సర్వసాధారణంగా మారడంతో పాకిస్థాన్ క్రికెట్కు నష్టం వాటిల్లుతోంది. మేం ఆడే రోజుల్లో ఈ తరహాసంస్కృతి లేదు. సంబంధిత సెలక్టర్లు ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ వ్యాఖ్యానించాడు. సీనియర్ అయినా జూనియర్ అయినా.. ఆటను దృష్టిలో ఉంచుకొనే ఏ ఆటగాడినైనా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని ఈ మాజీ వికెట్ కీపర్ అభిప్రాయపడ్డాడు.
దేశవాళీ క్రికెట్లో సీనియర్ ఆటగాళ్లు తప్పనిసరిగా భాగమయ్యేలా పీసీబీ చైర్మన్ రమీజ్ రజా దృష్టిసారించాలని సూచించాడు. సీనియర్లకు చోటుకల్పించాలని కోరాడు. ‘ఓ క్రికెటర్ విలువ రమీజ్ రాజాకు తెలిసుండాలి. జాతీయ టీ20 సిరీసుల్లో 5000 పరుగులు చేసిన వారు రెండో ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్నారు. ఆటగాళ్లు జాతీయ జట్టులోకి ప్రవేశించలేకపోతే, వారు కూడా దేశీయంగా ఆడకూడదా? ఎంఎస్ ధోనీ భారతీయ టీ20 లీగ్ ఆడుతున్నాడు. అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు) 2018లోనే రిటైర్ అయినా ఇప్పటికీ దేశవాళీ క్రికెట్లో పరుగులు చేస్తున్నాడు’ అని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం వయసు గురించి చర్చించుకుంటున్నారంటూ పీసీబీపై మండిపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?