2011 World Cup: ‘రోహిత్ శర్మను 2011 ప్రపంచకప్నకు ఎంపిక చేద్దామనుకున్నాం.. ధోనీ వద్దన్నాడు’
2011 వన్డే ప్రపంచకప్ జట్టులో రోహిత్ శర్మ (Rohit Sharma)కు చోటు దక్కకపోవడానికి గల కారణాన్ని అప్పటి సెలక్టర్ రాజావెంకట్ (Raja Venkat) బయటపెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో టీమ్ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ (2011 World Cup)ను సాధించిన సంగతి తెలిసిందే. భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలవడంలో సచిన్ తెందూల్కర్, యువరాజ్ సింగ్, గంభీర్, ధోనీ కీలకపాత్ర పోషించారు. అప్పుడు యువ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ కూడా తనవంతు కృషి చేశాడు. అయితే, కోహ్లీ కంటే ముందు జాతీయ జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ (Rohit Sharma)కు 2011 ప్రపంచకప్ జట్టులో చోటుదక్కలేదు. తాను ఆ ప్రపంచకప్ టీమ్లో భాగస్వామిని కాలేకపోయినందుకు చాలా బాధపడ్డానని రోహిత్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై 2008-2012 మధ్య టీమ్ఇండియా సెలక్షన్ ప్యానల్లో ఉన్న రాజావెంకట్ (Raja Venkat) ఓ క్రీడాఛానెల్తో మాట్లాడాడు. రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవాలనుకున్నప్పటికీ కెప్టెన్ ధోనీ.. పీయూష్ చావ్లా వైపు మొగ్గుచూపాడని మాజీ సెలక్టర్ వ్యాఖ్యానించాడు.
ఆ ఐదు సిక్స్లు నా జీవితాన్ని మార్చేశాయి: రింకూ సింగ్
‘‘ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరును మేం పరిగణనలోకి తీసుకున్నాం. అప్పుడు టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నందున యశ్పాల్ శర్మ (సెలక్టర్), నేనూ సౌతాఫ్రికాలో ఉన్నాం. మిగిలిన ముగ్గురు సెలక్టర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, సురేంద్ర భవే, నరేంద్ర హిర్వాణి చెన్నైలో ఉన్నారు. జట్టులో 15 మందికి చోటివ్వాలి. 1 నుంచి 14 స్థానాల వరకు ఎంపిక చేసిన ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ ఆమోదం తెలిపింది. 15వ ఆటగాడిగా మేం రోహిత్ శర్మ పేరును సూచించాం. కోచ్ గ్యారీ కిర్స్టన్ కూడా దీనిని సమర్థించాడు. కానీ, కెప్టెన్ ధోనీ ఇందుకు అంగీకరించలేదు. రోహిత్కు బదులుగా పీయూష్ చావ్లాను జట్టులోకి తీసుకోవాలకున్నాడు. వెంటనే గ్యారీ కిర్స్టెన్ యూటర్న్ తీసుకుని చావ్లా వైపు మొగ్గుచూపాడు. అలా రోహిత్ శర్మకు ప్రపంచకప్నకు దూరమయ్యాడు’’ అని మాజీ సెలక్టర్ వెల్లడించాడు. 2011 ప్రపంచకప్లో పీయూష్ చావ్లా మూడు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్తో ఐపీఎల్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే ‘ప్లేఆఫ్స్’కు చేరిన రెండో జట్టుగా మారుతుంది. -
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
మ్యాచులన్నీ ముగిసినా.. ఇటు బయటకు వెళ్లలేని పరిస్థితి. అటు నాకౌట్ దశకు అర్హత దక్కుతుందో తెలియని సంకటస్థితి దిల్లీ జట్టుకు ఉంది. -
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
ద్రవిడ్ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కోచ్ పదవి నుంచి వైదలగాలని భావిస్తున్నాడు. కనీసం టెస్టు జట్టుకు కూడా అతడు కోచ్గా ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. -
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా సంభాషణ వైరల్గా మారిపోయింది. ఆ పరిణామాలపై లఖ్నవూ కోచ్ స్పందించాడు. -
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
లఖ్నవూకు ఈ సీజన్లో ఏడో ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్కు వెళ్దామనే ఆశలకు బ్రేక్ పడేలా ఉంది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
హార్దిక్ నాయకత్వంపై విమర్శలు చేసిన విదేశీ మాజీ క్రికెటర్లను గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఐపీఎల్లో ఆ ఇద్దరి పాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం