Team India - WC 2023: తిలక్కు కలిసి రావొచ్చు.. ఫిట్నెస్ కీలకం.. నాలుగులో సూర్య!
వన్డే ప్రపంచ కప్ కోసం ప్రకటించే జట్టులో ఎవరు ఉంటారు..? యువకులకు అవకాశం వస్తుందా..? దాయాదుల మధ్య పోరులో ఎవరిది ఆధిక్యం? వంటి విషయాలపై మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ వర్మ వెస్టిండీస్ పర్యటనలో అదరొట్టేస్తున్నాడు. టీ20ల్లో అరంగేట్రం చేసిన వర్మ ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో వచ్చే ప్రపంచకప్లో అతడికి మిడిలార్డర్లో చోటు ఇవ్వాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఎడమ చేతివాటం కలిగిన తిలక్ దూకుడుగా ఆడటంలో రాటుదేలుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ స్క్వాడ్లోకి వచ్చే అవకాశాలు తిలక్ వర్మకు ఉన్నట్లు పేర్కొన్నాడు.
ముందు బ్యాటర్.. తర్వాతే కెప్టెన్
‘‘మిడిలార్డర్లో ఆడే శ్రేయస్ అయ్యర్ ఫిట్గా ఉన్నాడా..? లేదా అనేది తెలియదు. ఒకవేళ అతడు ఫిట్గా లేకుండా వరల్డ్ కప్ నుంచి వైదొలిగితే ఆ స్థానం కోసం సరైన వ్యక్తిగా తిలక్ వర్మను పరిగణనలోకి తీసుకొనేందుకు అవకాశం ఉంది. బహుముఖ ప్రజ్ఞే అతడికి ఛాన్స్ వచ్చేలా చేస్తుంది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోగలిగే సత్తా ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్లో వేగం తీసుకురాగలడు. టాప్ - 4లో ఎడమచేతివాటం బ్యాటర్ లేకపోవడం కూడా అతడికి కలిసిరావొచ్చు. స్ట్రైక్ను రొటేట్ చేస్తూ ఆసీస్ దిగ్గజం మైకెల్ బెవాన్లా కీలక ఇన్నింగ్స్లు ఆడగలడని భావిస్తున్నా’’ అని ప్రసాద్ తెలిపాడు.
సూర్యకుమార్కు నాలుగో స్థానం బాగుంటుంది: శిఖర్
వరల్డ్ కప్ జట్టులో తనకు స్థానం వస్తుందో లేదో అనే దాని గురించి ఆలోచించడం లేదని శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. అయితే, ఆసియా గేమ్స్ కోసం తనను ఎంపిక చేస్తారని భావించినా.. చోటు దక్కకపోవడంతో ఆశ్చర్యానికి గురైనట్లు పేర్కొన్నాడు. అలాగే ప్రపంచకప్లో నాలుగో స్థానంపైనా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘భారత్కు గొప్ప అవకాశాలు ఉన్నాయి. అనుభవం, యువతరంతో కూడిన జట్టు బరిలోకి దిగనుంది. స్వదేశంలో జరగనుండటం కూడా టీమ్ఇండియాకు కలిసొస్తుంది. కీలకమైన నాలుగో స్థానంలో సూర్యకుమార్ ఆడితే బాగుంటుంది. అతడు ఇక్కడ ఫిట్ అయిపోతాడు’’ అని ధావన్ తెలిపాడు.
భారత్ ఆటగాళ్ల ఫిట్నెస్ అత్యుత్తమంగా లేదు: అకిబ్ జావెద్
వన్డే ప్రపంచకప్లో వారి సొంతగడ్డపై టీమ్ఇండియాను ఓడించే అవకాశాలు తమ జట్టుకు ఉన్నాయని పాక్ మాజీ బౌలర్ అకిబ్ జావెద్ వ్యాఖ్యానించాడు. ‘‘పాక్ జట్టు సమతూకంగా ఉంది. భారత్లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ, ఎక్కువగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారి ఫామ్ కూడా అత్యున్నత స్థాయికి తగ్గట్టుగా లేదు. కొత్త ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టే పాక్కు భారత్ను ఓడించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి’’ అని జావెద్ వ్యాఖ్యానించాడు.
వారినే గుర్తు పెట్టుకుంటారు.. : డారెన్ సామీ
ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ పదేళ్ల నుంచి నిరీక్షిస్తోంది. నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక సమయంలో విఫలం కావడంతో విజేతగా నిలవలేపోతోంది. ఈ క్రమంలో భారత యువ ఆటగాళ్లను ఉద్దేశించి విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శుభ్మన్ గిల్.. ఇలా టాలెంటెడ్ ఆటగాళ్లను భారత్ తయారు చేయగలుగుతోంది. కానీ, ఎవరైతే ఐసీసీ ట్రోఫీని అందించగలుగుతారో వారినే అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ తొలి టెస్టులోనే భారీ శతకం సాధించాడు. ఇదంతా డొమిస్టిక్ క్రికెట్ ప్రమాణాలను తెలియజేస్తోంది. అక్కడ బాగా ఆడితే జాతీయ జట్టులోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’’ అని సామీ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
పొట్టి ప్రపంచకప్లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-17 సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. ఈమేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. -
T20 World Cup 2024: న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా పేర్లు
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్