Tim Southee: పాత బంతితో స్వింగ్ రాబట్టేందుకు కష్టపడ్డా: టిమ్ సౌథీ
తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కివీస్ బౌలర్....
ఇంటర్నెట్ డెస్క్: తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కివీస్ బౌలర్ టిమ్ సౌథీ (5/69) కీలక పాత్ర పోషించాడు. దీంతో టెస్టు కెరీర్లో 13వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ సందర్భంగా టిమ్ సౌథీ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా విదేశాల్లో ఎక్కువగా పర్యటించడం కలిసొచ్చిందన్నాడు. అక్కడి పరిస్థితులను త్వరితగతిన అర్థం చేసుకోవడం వల్లే మంచి ప్రదర్శన చేయగలుగుతున్నట్లు వెల్లడించాడు. 2008లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన టిమ్ సౌథీ ఇప్పటి వరకు 80 టెస్టులు ఆడాడు. మొత్తం 315 వికెట్లు పడగొట్టాడు. ‘‘యువ క్రికెటర్గా ఉన్నప్పుడే ప్రపంచమంతా చుట్టిరావడం ఇప్పుడు కలిసొస్తుంది. ఆ పర్యటనల నుంచి ఎంతో నేర్చుకున్నా. వికెట్ల ఆకలి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బాగా రాణించగలం. ఎక్కడ ప్రాతినిధ్యం వహించినా... నేర్చుకునేందుకు, మెరుగ్గా ఆడేందుకు మార్గాలను అన్వేషించాలి’’ అని చెప్పుకొచ్చాడు.
టెస్టుల్లో రాణించాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు సానపట్టాలని, ఎంతో సాధన చేయాలని టిమ్ సౌథీ సూచించాడు. ‘‘కొత్త బంతిని ఇరు వైపులా స్వింగ్ చేయగలిగాలి. పాత బంతితోనూ రాణించేందుకు తీవ్రంగా కృషి చేయాలి. వికెట్లు తీసేందుకు ఉన్న మార్గాలను ప్రయత్నించాలి. ఉపఖండం పిచ్లపైనా ఇదే విధంగా ఆడాల్సి ఉంటుంది. నా వరకైతే పాత బంతితో స్వింగ్ రాబట్టేందుకు చాలా కష్టపడ్డాను. దీంతో ఇప్పుడు ఓల్డ్ బాల్ను స్వింగ్ చేసే నైపుణ్యం సొంతం చేసుకున్నా’’ అని వివరించాడు. భారత్తో తొలి టెస్టులో సౌథీతోపాటు జేమీసన్ (3/91), అజాజ్ పటేల్ (2/90) రాణించారు. రెండో రోజు 258/4 స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌటైంది. ఇవాళ కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగింటిని సౌథీనే తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజ్లో ఓపెనర్లు టామ్ లాథమ్ (50*), విల్ యంగ్ (75*) ఉన్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.