Novak Djokovic : జకోవిచ్కు మళ్లీఎదురు దెబ్బ.. ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడటం అసాధ్యం!
అత్యధిక గ్రాండ్స్లామ్లను గెలుచుకోవాలన్న కోరిక జకోవిచ్కు ఇప్పట్లో..
వీసా పునరుద్ధరణ పిటిషన్ను తిరస్కరించిన ఫెడరల్ కోర్టు
మెల్బోర్న్: అత్యధిక గ్రాండ్స్లామ్లను గెలుచుకోవాలన్న కోరిక జకోవిచ్కు ఇప్పట్లో తీరేలా లేదు. ఆస్ట్రేలియా ఓపెన్ను సొంతం చేసుకుని ఎక్కువ గ్రాండ్స్లామ్లు (21) సొంతం చేసుకుని రికార్డు సృష్టిద్దామని భావించిన జకోవిచ్కు వ్యాక్సినేషన్ వ్యవహారం అడ్డంకిగా మారింది. టోర్నీలో ఆడకుండా ఆస్ట్రేలియా మంత్రి రద్దు చేసిన వీసాను పునరుద్ధరించాలని దాఖలు చేసిన పిటిషన్ను అక్కడి ఫెడరల్ న్యాయస్థానం కొట్టేసింది. దీంతో పదకొండు రోజులపాటు సాగిన జకోవిచ్ పోరాటం ముగిసింది. సోమవారం నుంచే తొలి రౌండ్ పోటీలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడలేకపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదీ జరిగింది..
ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనే ప్లేయర్లు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలని నిర్వాహకులు నిబంధన విధించారు. కొవిడ్ సోకిందనే కారణంతో జకోవిచ్ మినహాయింపు కోరాడు. అందుకు టోర్నీ నిర్వాహకులు, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. దీంతో టోర్నీ కోసం గత బుధవారం మెల్బోర్న్ చేరుకున్న జకోను ఎయిర్పోర్ట్లో సరిహద్దు భద్రతా దళం అడ్డుకుంది. మినహాయింపు కోరేందుకు అతని కారణం సహేతుకంగా లేదని వీసా రద్దు చేసి ఇమిగ్రేషన్ నియంత్రణలోని హోటల్కు తరలించింది. దీంతో కోర్టును ఆశ్రయించిన జకోకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అతని వీసా పునరుద్ధరించడంతో పాటు ఆ హోటల్ నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇమిగ్రేషన్ మంత్రి అలెక్స్ మాత్రం తన వ్యక్తిగత అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు మరోసారి అతని వీసా రద్దు చేశారు. దీనిపైనే కోర్టుకు వెళ్లగా అక్కడా జకోవిచ్కు చుక్కెదురైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్