టీమిండియా చెప్పిందంటే కంగారు పడాల్సిందే
నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా సముఖంగా లేదని వార్తలు వచ్చినప్పుడు కంగారు పడ్డానని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. బ్రిస్బేన్లో ఆఖరి టెస్టు ఆడటానికి టీమిండియాకు ఇష్టం లేదని వార్తలు వచ్చిన ...
ఇంటర్నెట్డెస్క్: నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా సముఖంగా లేదని వార్తలు వచ్చినప్పుడు కంగారు పడ్డానని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. బ్రిస్బేన్లో తుది టెస్టు ఆడటానికి టీమిండియాకు సిద్ధంగా లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పైన్ స్పందిస్తూ... ‘‘కొన్ని విషయాలు ఉత్కంఠకు దారితీశాయి. దీంతో టెస్టు కొనసాగడం ఉత్కంఠ నెలకొంది. అయితే, టీమిండియా సముఖంగా లేదని, నాలుగో టెస్టు ఆడటంపై స్పష్టత రాలేదని, భారత బృందంలో కొందరు పేర్కొన్నట్లు.. తెలియడంతో ఆందోళనకు గురయ్యా. ప్రపంచ క్రికెట్లో అత్యంత శక్తివంతమైన టీమిండియా నుంచి అలాంటి విషయాలు విన్నప్పుడు అవి జరుగుతాయేమో అనిపిస్తుంది’’ అని పైన్ వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.
‘‘మేం ప్రస్తుతం మూడో టెస్టు గురించే ఆలోచిస్తాం. నిబంధనలపై మాకు అవగాహన ఉంది. ఈ వారం ఆటపైనే దృష్టిసారిస్తాం. వచ్చే వారం గురించి తర్వాత ఆలోచిస్తాం. అదే వేదికపై జరగాలని మేం కోరుకోవట్లేదు. ముంబయిలో మ్యాచ్ జరిగినా దానికి తగ్గట్లుగా సన్నద్ధమై బరిలోకి దిగుతాం. ఎంతో కాలం తర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్నందుకు ఇరు జట్లు సంతోషంగా ఉన్నాయి’’ అని పైన్ పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారా అని అడిగిన ప్రశ్నకు పైన్ సమాధానం ఇవ్వలేదు. ఆ విషయాన్ని టీమిండియానే అడగాలని తోసిపుచ్చాడు.
ఇండోర్ రెస్టారెంట్కు వెళ్లినందుకు రోహిత్ శర్మతో సహా నలుగురు ఆటగాళ్లను ఐసోలేషన్లో ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీ, హార్దిక్తో సహా టీమిండియా ఆటగాళ్లు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారని ఆస్ట్రేలియా మీడియా దుష్రచారం చేసింది. మరోవైపు నిబంధనలు పాటించకపోతే బ్రిస్బేన్కు భారత ఆటగాళ్లు రావాల్సిన అవసరం లేదని క్వీన్స్లాండ్ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడంతో టెస్టు సిరీస్పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిస్బేన్లో నాలుగో టెస్టు ఆడేందుకు భారత్కు ఇష్టం లేదని, అవసరమైతే సిరీస్ను మూడు టెస్టులకే పరిమితం చేయాలని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ వదంతులేనని, టీమిండియా నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని సీఏ స్పష్టం చేయడంతో టెస్టు సిరీస్పై సందిగ్ధత తొలగింది. కాగా, సిడ్నీ వేదికగా గురువారం నుంచి భారత్×ఆసీస్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక