Imran Khan: ఇమ్రాన్ ఖాన్ను విస్మరించడంతో నెట్టింట ట్రోలింగ్.. దిగొచ్చిన పాక్ క్రికెట్ బోర్డు
వన్డే ప్రపంచకప్ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన వీడియోలో మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను విస్మరించి విమర్శలపాలైన పీసీబీ తప్పుని సరిదిద్దుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ ప్రచారంలో భాగంగా పాకిస్థాన్ తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 14న) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఓ వీడియో పోస్ట్ చేసింది. పాక్ క్రికెట్ ప్రముఖులు సాధించిన ఘనతలను ఆ వీడియోలో వివరించింది. అయితే, 1992లో పాక్కు వరల్డ్ కప్ను అందించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అందులో చూపించలేదు. కావాలనే పీసీబీ ఇమ్రాన్ఖాన్ గొప్పతనాన్ని విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం మాజీ ప్రధాని ఇమ్రాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఖాన్ను పీసీబీ తన వీడియోలో చూపించకుండా చేయడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. పీసీబీ తీరును నిరసిస్తూ క్రికెట్ అభిమానులు #ShameOnPCBతో ట్రోలింగ్ చేశారు. పలువురు పాక్ మాజీ ఆటగాళ్లు సైతం పీసీబీని విమర్శించారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఆగస్ట్ 14న పోస్ట్ చేసిన వీడియోని డిలీట్ చేసింది.
‘విరాట్ కోహ్లీని కెప్టెన్గా కొనసాగించి ఉంటే భారత్ ఈ స్థితిలో ఉండేది కాదు’
తాజాగా (ఆగస్టు 17న) కొత్త వీడియోని పోస్ట్ చేసింది. 1992 ప్రపంచకప్ సమయంలో ఇమ్రాన్ఖాన్ ప్రపంచకప్ అందుకున్న దృశ్యాలను పొందుపర్చి ఈ వివాదానికి ముగింపు పలికింది. 1992 వన్డే ప్రపంచ కప్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ టైటిల్ పోరులో పాక్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 72 పరుగులు చేసి జట్టు మంచి స్కోరు (249/6) సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత పాకిస్థాన్ మరోసారి ప్రపంచకప్ విజేతగా నిలవలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర