Trolling on PCB: ఇమ్రాన్ ఖాన్ను విస్మరించిన పాక్ క్రికెట్ బోర్డు.. నెట్టింట ట్రోలింగ్!
రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఫర్వాలేదు కానీ.. క్రీడల్లో జట్టుకు అందించిన ఘనతలను తక్కువగా చేసి చూపించడం తగదని అభిమానులు పేర్కొన్నారు. తాజాగా పాక్ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో పీసీబీ వ్యవహరించిన తీరు నెట్టింట విమర్శలకు దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నెట్టింట ట్రోలింగ్కు గురైంది. తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 14న) సందర్భంగా పీసీబీ చేసిన వీడియో ట్వీట్ ఈ వివాదానికి కారణమైంది. తమ దేశ క్రికెట్ ప్రముఖుల గురించి చెప్పే క్రమంలో 1992లో పాక్కు వరల్డ్ కప్ను అందించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) గొప్పతనాన్ని కావాలనే విస్మరించినట్లు విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం మాజీ ప్రధాని ఇమ్రాన్ ‘తోషీఖానా’ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఖాన్ను పీసీబీ తన వీడియోలో చూపించకుండా చేయడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. పీసీబీ మాజీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్ కూడా వెంటనే ఆ వీడియోను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు క్రికెట్ అభిమానులు సైతం రాజకీయాలు వేరు, క్రీడలు వేరని పీసీబీని #ShameOnPCBతో ట్రోలింగ్ చేశారు.
‘‘చరిత్ర అనేది కేవలం ఒక్క రోజులోనే సృష్టించలేం. దిగ్గజాలను విస్మరించేలా ఇలాంటి వీడియోలు చేయడం సహించలేనిది’’
‘‘మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం గ్యాలరీలోని దిగ్గజాల్లో ఇమ్రాన్ ఖాన్ ఒకరు’’
‘‘ఇమ్రాన్ లేకుండా 1992 వరల్డ్ కప్ లేదు. కుటిల ఆలోచనలతో బతకడం ఇప్పటికైనా ఆపండి. ప్రతి క్రికెట్ అభిమాని మదిలో నిలిచిపోతాడు. ఇలాంటి చెత్త వీడియోల ద్వారా మీ గుర్తింపును కోల్పోవడం ఖాయం’’
మీకేమైనా సమస్యలు ఉంటే..: ఖలీద్ మహమూద్
‘‘ఇలాంటి వీడియోలు పెట్టడం అత్యంత బాధాకరం. వెంటనే పీసీబీ వీడియోను తొలగించాలి. మళ్లీ ఇమ్రాన్ ఖాన్తో కూడిన వీడియోను అప్లోడ్ చేయాల్సిందే. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ ప్రోమోలోనే ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజామ్ను సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదని విమర్శించాం. మన గళం వారికి వినిపించాం. అలాంటిది క్రికెట్ దిగ్గజానికి ఇలాంటి అవమానం జరగడం సహేతుకం కాదు. మీకు ఇమ్రాన్ ఖాన్తో రాజకీయపరంగా ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు. అతడి హయాంలో జరిగిన విషయాల్లో అభిప్రాయభేదాలు ఉంటే వాటిని అలాగే ఎదుర్కోవాలి. అంతేకానీ, క్రికెట్కు రాజకీయాలకు ముడి పెట్టొద్దు. పాకిస్థాన్ కెప్టెన్గా దేశ క్రికెట్కు వన్నె తెచ్చిన ఆటగాడిని ఇలా అవమానించడం తగదు’’ అని మహమూద్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ఏప్రిల్లో రూ.2.10 లక్షల కోట్లు
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా