Rahul Dravid: మేం ఏం చేసినా.. చివరికి మా లక్ష్యమదే: రాహుల్ ద్రవిడ్
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ (WI vs IND) ఓడిపోవడంపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ఇలాంటి సిరీసుల్లో మ్యాచ్ ఫలితం సమస్య కాదని.. మా లక్ష్యమంతా మెగా టోర్నీలేనని వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ (WI vs IND) పరాజయం పాలైంది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లేకుండా బరిలోకి దిగిన టీమ్ఇండియా ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయింది. ఈ క్రమంలో ప్రయోగాలు చేయడంపై భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. తమ ప్రథమ లక్ష్యం రిజర్వ్ బెంచ్ను పరీక్షించడమేనని, దాని కోసం ఈ సిరీస్ను వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
‘‘ఆసియా కప్, ప్రపంచకప్ కోసం మా జట్టను సన్నద్ధం చేసుకోవడానికి ఇదే మాకున్న చివరి అవకాశం. జట్టులోని ఆటగాళ్లను పరీక్షించడానికే ఇలాంటి మార్పులు చేస్తున్నాం. అందరికి అవకాశాలు ఇవ్వడమే మా ఉద్దేశం. ఎన్సీఏలో ఉండి వచ్చిన వారిని ఆడించేందుకు ప్రయత్నించాం. వారిలో కొంతమందైనా మెగా టోర్నీల సమయానికి ఫిట్గా ఉంటే జట్టుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఎప్పుడూ భారీ టోర్నీలను దృష్టిలో పెట్టుకునే టీమ్ను సన్నద్ధం చేస్తాం. ఏదో ఒక మ్యాచ్ లేదా సిరీస్లో ఓటమి ఎదురైనా పట్టించుకోం.
కుందేలు పరిగెత్తినట్లు కాదు.. తాబేలులా ముందుకు..
ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ముందు ఇలాంటి సిరీసుల్లో రెండు లేదా మూడు మ్యాచ్లు ఆడటం వల్ల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బయట నుంచి వచ్చే అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఇప్పుడున్న జట్టులో అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. వారంతా దేశవాళీ స్థాయిలో రాణించి వచ్చినవారే. జట్టులోని అందరికీ అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే, రెండో వన్డేలో ఓడిపోవడం కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. బార్బడోస్ పిచ్ కఠినంగా ఉంది. బ్యాటింగ్ చేయడం అంత సులువేం కాదు. కనీసం 230 -240 పరుగులు చేసినా మంచి స్కోరుగా మారేది. మధ్యలో వికెట్లను కోల్పోవడంతో 60 పరుగులు చేయలేకపోయాం.
సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటగాడు. తప్పకుండా వన్డే క్రికెట్లో కీలకంగా మారతాడు. దురదృష్టవశాత్తూ టీ20లతో పోలిస్తే వన్డేల్లో అతడి ప్రదర్శన సరిగ్గా లేదనేది వాస్తవం. అయితే, తప్పకుండా మెరుగుపడతాడనే విశ్వాసం మాకుంది. దానికోసం అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తాం. వాటిని సద్వినియోగం చేసుకుంటాడని భావిస్తున్నాం. ఓపెనర్గా వచ్చిన ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. ఇలాంటి పిచ్పై వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడం అభినందనీయం. యంగ్ ప్లేయర్ల నుంచి మేం ఆశించేది కూడా ఇలాంటి ప్రదర్శనే’’ అని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా