Hardik: కుందేలు పరిగెత్తినట్లు కాదు.. తాబేలులా ముందుకు..: హార్దిక్
రెండో వన్డేలో విండీస్ (WI vs IND) అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో భారత్, విండీస్ 1-1తో సమంగా నిలిచాయి. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన టీమ్ఇండియా ఓటమిని చవిచూసింది.
ఇంటర్నెట్ డెస్క్: రెండో వన్డేలో భారత్కు (WI vs IND) చుక్కెదురైంది. విండీస్ బౌలింగ్ను తట్టుకోవడంలో ఓపెనర్లు మినహా టీమ్ఇండియా (Team India) బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 181 పరుగులకే ఆలౌటైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగిన భంగపాటు తప్పలేదు. అనంతరం 182 పరుగుల టార్గెట్ను కాపాడుకోవడంలోనూ భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆరంభంలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ వికెట్లను పడగొట్టారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యతోపాటు ఇతర బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. ఈ క్రమంలో భారత్ ఓటమిపై హార్దిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. రెండో వన్డేలో వెస్టిండీస్ విజయం
‘‘బ్యాటింగ్లో మేం అనుకున్న విధంగా రాణించలేకపోయాం. తొలి వన్డేతో పోలిస్తే ఈ మ్యాచ్కు వినియోగించిన పిచ్ బాగుంది. సరైన ప్రదర్శన ఇవ్వలేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. అయితే, తప్పకుండా ఇలాంటి ఓటముల నుంచి పాఠాలను నేర్చుకుంటాం. మా ఓపెనర్లు ఇచ్చిన శుభారాంభాన్ని కొనసాగించలేకపోయాం. ఇషాన్ కిషన్ మినహా మిగతా బ్యాటర్లం నేరుగా ఫీల్డర్లకే క్యాచ్లు ఇచ్చి పెవిలియన్కు చేరడం నిరాశకు గురి చేసింది. బౌలింగ్లోనూ నేను మరిన్ని ఓవర్లు వేయడంపై దృష్టిపెట్టాలి. వన్డే ప్రపంచ కప్ నాటికి సిద్ధం కావాలంటే నేను ఇంకా శ్రమించాలి. అయితే, కుందేలు మాదిరిగా కాకుండా తాబేలులా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగుతున్నా. మెగా టోర్నీ నాటికి సిద్ధమవుతానని భావిస్తున్నా. ప్రస్తుతం విండీస్తో సిరీస్లో 1-1తో సమంగా ఉన్నాం. చివరి మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నా’’ అని పాండ్య అన్నాడు
అలా జరిగినప్పుడు మాదే విజయం: షై హోప్
‘‘రెండో వన్డేలో నా ఆట పట్ల ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసినా మా జట్టు గెలుస్తుంది. ఇలాంటి వికెట్ మీద పరుగులు చేయాలంటే జాగ్రత్తగా ఆడాలి. భారత్ వంటి నాణ్యమైన బౌలింగ్ను ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఒక మ్యాచ్ గెలిచాం. తర్వాతి మ్యాచ్నూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంటాం. మా ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. మా ఆట ఎలా ఉండాలని అనుకున్నామో అదే విధంగా మైదానంలో ప్రదర్శించాం. పిచ్ నుంచి సవాల్ ఎదురైంది. అయినా ఎదురొడ్డి విజయం సాధించాం. తప్పకుండా సిరీస్ను నెగ్గుతామనే నమ్మకం ఉంది’’ అని విండీస్ కెప్టెన్ షై హోప్ వ్యాఖ్యానించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతడే సొంతం చేసుకున్నాడు. గత పది వన్డేల తర్వాత భారత్పై విండీస్కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం