Womens IPL: మాక్కూడా ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుంది: హర్మన్ప్రీత్
మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే జరుగుతుందనే...
బిగ్బాష్లీగ్లో టీమ్ఇండియా టీ20 జట్టు సారథి అరుదైన రికార్డు
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే జరుగుతుందనే నమ్మకం ఉందని టీమ్ఇండియా ఉమెన్స్ టీ20 సారథి హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. వరల్డ్ బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనేగేడ్స్కు ప్రాతినిధ్యం వహించిన హర్మన్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికై అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆమె భారత్ నుంచి తొలి మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన 14 మ్యాచుల్లో 399 పరుగులు, 15 వికెట్లు తీసింది. ఈ సందర్భంగా హర్మన్ప్రీత్ మాట్లాడుతూ.. ‘‘చాలా సంతోషంగా ఉంది. నేను సాధించిన వాటిలో ఇదొక పెద్ద అచీవ్మెంట్. మద్దతుగా నిలిచిన జట్టుకు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. జట్టు నా నుంచి ఏం కోరుకుందో దానిని అందివ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా’’ అని పేర్కొంది. బిగ్బాష్లో తన ప్రదర్శనతో భవిష్యత్తు తరాల భారత మహిళా క్రికెటర్లకు స్ఫూర్తి నింపుతానని, వారు కూడా ఇలాంటి టోర్నీల్లో పాల్గొంటారనే ఆశాభావాన్ని వ్య్తక్తం చేసింది. బిగ్బాష్తోపాటు ఇంగ్లాండ్లోని సూపర్లీగ్లో ఆడిన తొలి టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కావడం విశేషం.
పొట్టి ఫార్మాట్లో విశేష ఆదరణ పొందుతున్న లీగ్ల్లో ఐపీఎల్ ఒకటి. అయితే మహిళల కోసం పూర్తిస్థాయిలో ఐపీఎల్ నిర్వహించాలని చాలా కాలంగా పలువురు మహిళా క్రికెటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంది. ‘‘మహిళల ఐపీఎల్ కోసం మేం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే ప్రారంభమవుతుందని ఆశిస్తున్నా. మంచి ప్రదర్శన ఇవ్వడం వరకే మా చేతుల్లో ఉంది. మిగతా విషయాలన్నీ బీసీసీఐ, ఐపీఎల్ బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి’’ అని హర్మన్ వివరించింది.
బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ గెలుపుల్లో హర్మన్ ముఖ్య భూమిక పోషించింది. స్వల్ప స్కోర్లు నమోదైన తొలి మ్యాచ్లోనే (హోబర్ట్ హరికేన్స్ జట్టుతో) నాటౌట్ నిలిచి కీలకమైన 24 పరుగులను చేయడంతో మెల్బోర్న్ విజయం సాధించింది. అటు బౌలింగ్లోనూ (1/20) మంచి ప్రదర్శనే ఇచ్చింది.
* అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన రెండో మ్యాచ్లోనూ హర్మన్ (41) రాణించింది. ఇటు బౌలింగ్లోనూ (1/31) పర్వాలేదనిపించినా మెల్బోర్న్కు ఓటమి తప్పలేదు.
* సిడ్నీస్ట్రైకర్స్తో మ్యాచ్లో తొలుత బౌలింగ్లో (2/17) చెలరేగిన హర్మన్.. బ్యాటింగ్లోనూ (35 పరుగులు నాటౌట్) ఆఖరి ఉండి జట్టుకు విజయాన్ని అందించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది. సిడ్నీ సిక్సర్స్ జట్టుతో మ్యాచ్లోనూ హర్మన్ (43) మరో కీలక ఇన్నింగ్స్ ఆడింది.
* మళ్లీ అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేసింది. తొలుత బౌలింగ్లో (2/31)తో సత్తా చాటిన హర్మన్.. ఛేదనలోనూ దుమ్మురేపింది. కేవలం 46 బంతుల్లోనే 73 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది.
* బ్రిస్బేన్ హీట్ జట్టుపైనా హర్మన్ (62) సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్రిస్బేన్ కూడా లక్ష్య ఛేదన దిశగా సాగింది. ధాటిగా ఆడిన క్లార్క్ (ఆరు బంతుల్లో 15 పరుగులు)ను హర్మన్ప్రీత్ (1/19) ఔట్ చేయడంతో విజయం మెల్బోర్న్ను వరించింది.
* మెల్బోర్న్ స్టార్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో (3/22) అద్భుతమైన బౌలింగ్తో మెల్బోర్న్ రెనెగేడ్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్స్ 103 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెనెగేడ్స్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని (104 పరుగులు) ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్