ODI World Cup 2023: అశ్విన్ ఆలోచన బాగుంది.. కానీ అది మన చేతుల్లో లేదు: రోహిత్
న్యూజిలాండ్తో (New Zealand) తొలి వన్డే ఆడేందుకు టీమ్ఇండియా (Team India) హైదరాబాద్కు చేరుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక విషయాలపై మాట్లాడాడు. అలాగే ప్రపంచకప్ మ్యాచ్లకు (ODI World Cup 2023) సంబంధించి ఇటీవల అశ్విన్ చేసిన సూచనలపైనా రోహిత్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. అయితే డే/నైట్ మ్యాచ్ సందర్భంగా మంచు ప్రభావం ఛేదన చేసే జట్టుకు లబ్ధి చేకూర్చుతుందని, బౌలింగ్ వేసే టీమ్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదే విషయంపై అశ్విన్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ల వేళలను కాస్త ముందుకు జరిపితే బాగుంటుందని తెలిపాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు కాకుండా ఉదయం 11.30కే ప్రారంభించాలని సూచించాడు. లేకపోతే టాస్ కీలకంగా మారుతుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్తో సిరీస్ సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇలాంటి ప్రశ్న ఎదురవడంతో స్పందించాడు.
‘‘ఇది మంచి ఆలోచనే. అయితే టాస్ మీదే ఎక్కువ ఆధారపడకుండా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రపంచకప్. కాస్త ముందుగానే మ్యాచ్ను ప్రారంభించాలనే ఆలోచన నాకు నచ్చింది. అయితే ఇది సాధ్యమవుతుందా..? లేదా..? అనేది నాకైతే తెలియదు. ప్రసారకర్తలు దానిని నిర్ణయిస్తారు (నవ్వుతూ). అయితే మ్యాచ్లో ఒకరికి ప్రయోజనం కలగడం మాత్రం సరైంది కాదు. మంచుతో కూడిన పరిస్థితుల్లో బ్యాటింగ్ అడ్వాంటేజ్ లేకుండా నాణ్యమైన క్రికెట్ను ఆడాలని కోరుకోవాలి. అయితే ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. మ్యాచ్ను ముందుగా ప్రారంభించాలనే ఆలోచన మాత్రం బాగుంది’’ అని రోహిత్ వెల్లడించాడు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్తో తొలి వన్డే మ్యాచ్ను భారత్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..