WI vs IND: అలాంటి బాధ్యతల స్వీకరణకు ముందుకురావడం అభినందనీయం: రోహిత్
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించిన టీమ్ఇండియా 1-0 తేడాతో విండీస్ను (WI vs IND) చిత్తు చేసి టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. రెండో టెస్టులోనూ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ.. వర్షం కారణంగా డ్రాగా ముగించాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్ - భారత్ జట్ల (WI vs (IND) మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దు కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన టీమ్ఇండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన టెస్టు కెరీర్లో తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కించుకున్నాడు. అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్వైట్, టీమ్ఇండియా పేసర్ సిరాజ్ మాట్లాడారు.
ఇలా జరగడం దురదృష్టకరం..
‘‘ఎక్కడ విజయం సాధించినా దానికి ప్రత్యేకత ఉంటుంది. వెస్టిండీస్తో వారి సొంత దేశంలో సిరీస్ను గెలవడం ఆనందంగా ఉంది. అయితే, రెండో టెస్టు చివరి రోజు ఆట కూడా జరిగి ఉంటే బాగుండేది. వర్షం కారణంగా సాధ్యపడకపోవడం దురదృష్టకరం. అభిమానులతోపాటు మమ్మల్ని నిరాశకు గురిచేసింది. ఇలాంటి పిచ్ (ట్రినిడాడ్) మీద పరుగులు చేయడం చాలా కష్టమే. కానీ, మా బ్యాటర్లు దూకుడుగా ఆడి పరుగులు రాబట్టడం అభినందనీయం. పేసర్ సిరాజ్ నిరంతరం మెరుగుపడుతూనే ఉన్నాడు. ఈ సిరీస్లో పేస్ బౌలింగ్ను నడిపించడానికి ముందుడుగు వేయడం గొప్ప నిర్ణయం. అయితే, ఎవరో ఒకరే నడిపించాలనే దానిని అంగీకరించను. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. బౌలింగ్ కోసం బంతిని చేతిలోకి తీసుకున్న వారు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలి.
వదలని వరుణుడు.. విండీస్తో రెండో టెస్టు డ్రా
ఈ మ్యాచ్లో ప్రమోషన్ పొంది ముందుకొచ్చిన ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వేగంగా పరుగులు చేయాలనేదే మా లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే ఇషాన్ ఇన్నింగ్స్ సాగింది. ఎక్కడా భయపడకుండా ధాటిగా ఆడాడు. విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడు నిలకడగా ఆడితే ఎలాంటి జట్టుకైనా సానుకూలాంశంగా మారుతుంది. రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు మా జట్టు యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉంది. ఒత్తిడిలోనూ రాణించేలా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్లను బలోపేతం చేయడమే మా ముందున్న కర్తవ్యం’’ అని రోహిత్ తెలిపాడు.
కాస్త పోరాటపటిమ చూపాం: బ్రాత్వైట్
‘‘తొలి టెస్టు మ్యాచ్లో మా ప్రదర్శన తీసికట్టుగా ఉంది. అయితే, రెండో టెస్టులో మాత్రం భారత్కు కాస్త సవాల్ విసిరాం. పోరాటపటిమ చూపామని భావిస్తున్నా. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఐదు వికెట్లు కోల్పోవడంతో వెనుకబడిపోయాం. అలా జరగకుండా ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటే మేం కూడా ఛేదన దిశగా సాగేవాళ్లమే. వర్షం కారణంగా ఆట రద్దు కావడం కాస్త బాధించింది. మా యువ ఆటగాడు అథనేజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అలాగే కిర్క్ మెకంజీ కూడా మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ ఇలాగే కొనసాగితే విండీస్ క్రికెట్కు చాలా కాలం ఆడతారు’’ అని బ్రాత్వైట్ చెప్పాడు.
ఇది నా ఫస్ట్ అవార్డు: సిరాజ్
‘‘నా టెస్టు కెరీర్లో ఇది తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. విదేశాల్లో ఇలాంటి ప్రదర్శనతో దాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. అనుకున్న విధంగా బంతిని సంధించడమే నా సింపుల్ లాజిక్. దానికే కట్టుబడి బౌలింగ్ చేశా. ఇలాంటి పిచ్పై వికెట్లు తీస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. రోహిత్ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ఎంజాయ్ చేస్తూ బౌలింగ్ వేయమని సూచించాడు’’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..