IPL 2024: నా కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడడు: హార్దిక్ పాండ్య
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి ఐపీఎల్లో ముంబయి జట్టుతో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 17వ సీజన్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ (IPL) సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) వ్యాఖ్యానించాడు. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో పాండ్య మాట్లాడాడు. రోహిత్ శర్మతో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తన కెప్టెన్సీలో హిట్మ్యాన్ ఆడటం ఇబ్బందేమీపడకపోవచ్చని హార్దిక్ తెలిపాడు. ఈ సీజన్లో అతడి సాయంతో జట్టును విజయాల బాట పట్టిస్తాననే నమ్మకం ఉందన్నాడు. మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో ముంబయి తొలి మ్యాచ్ ఆడనుంది.
‘‘నా సారథ్యంలో రోహిత్ ఆడటంలో పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. తప్పకుండా అతడి సాయం తీసుకుని జట్టును నడిపిస్తా. ఎలాంటి అవసరం ఉన్నా సంప్రదిస్తా. అతడు భారత జట్టు సారథి. ఇప్పుడు నాకు సహకారం అందిస్తాడు. రోహిత్ నాయకత్వంలో ముంబయి ఏం సాధించిందనేది అందరికీ తెలుసు. దానిని కొనసాగించాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి, నేను సారథి అయినంత మాత్రాన రోహిత్ ఆడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా కెరీర్ మొత్తం అతడి సారథ్యంలోనే ఆడా. తప్పకుండా ఈ సీజన్ మొత్తం నా భుజంపై అతడి చేయి ఉంటుందని భావిస్తున్నా. కెప్టెన్సీ ప్రకటించినప్పుడు అభిమానుల నుంచి విభిన్న స్పందనలు వచ్చాయి. అయితే, అభిమానులను నేను గౌరవిస్తా. అదే సమయంలో మేం జట్టుగా ఆటపై దృష్టి పెడతాం. నా నియంత్రణలో ఉన్న వాటిని గమనిస్తూనే ఉంటా. కానీ, అదుపు చేయలేని వాటిని ఏం చేయలేం. ఏదైనా అనే హక్కు అభిమానులకు ఉంది. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తా’’ అని పాండ్య తెలిపాడు.
బీసీసీఐ నుంచి సూర్య ఫిట్నెస్ అప్డేట్ రావాలి: బౌచర్
ముంబయి ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్పై ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ తర్వాత సూర్య ఇప్పటి వరకు మైదానంలోకి దిగలేదు. ‘‘మేం సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్కు సంబంధించిన అప్డేట్ కోస వేచి చూస్తున్నాం. బీసీసీఐ నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఎలాంటి ఫిట్నెస్ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. మా వద్ద ప్రపంచస్థాయి వైద్యబృందం అందుబాటులో ఉంది’’ అని బౌచర్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!