IPL 2023: రోహిత్ శర్మ ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలి: సునీల్ గావస్కర్
రోహిత్ శర్మ ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక సూచన చేశాడు. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. తద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final)కు ఫ్రెష్ మైండ్సెట్తో బరిలోకి దిగొచ్చని చెప్పాడు. అవసరమైతే రోహిత్ ఐపీఎల్ చివరి అంకంలో మూడు, నాలుగు మ్యాచ్లు ఆడి లయను అందుకోవచ్చని గావస్కర్ వివరించాడు. జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పోరులో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
‘‘రోహిత్ శర్మ కాస్త ఒత్తిడికి గురువుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గురించి ఆలోచిస్తున్నాడని అనుకుంటున్నా. రోహిత్ ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే ఆఖర్లో మూడు, నాలుగు మ్యాచ్లు ఆడాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం అతడు లయను అందుకోవడానికి ఆ మ్యాచ్లు ఉపయోగపడతాయి’’ అని సునీల్ గావస్కర్ చెప్పాడు. ముంబయి ఇండియన్స్ ఆటతీరు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. వారు టాప్-4లో చోటు దక్కించుకోవాలనుకుంటే అసాధారణ ప్రదర్శన కనబర్చాలి. బౌలర్లు పదే పదే అవే తప్పులు చేస్తున్నప్పుడు కొన్ని మ్యాచ్లకు వారి పక్కన పెట్టాలి. అనంతరం బౌలర్లు ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించాలి’’ అని గావస్కర్ సూచించాడు.
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ తన స్థాయి తగ్గట్టుగా ఆడట్లేదు. ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింటి ఓటమిపాలై మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆ జట్టుకు బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది. ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చేస్తూ మ్యాచ్పై పట్టుకోల్పోతున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబయి ఏడో స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే