Rohit Sharma: యువరాజ్ తర్వాత ఆ స్థానంలో ఎవరూ సక్సెస్ కాలేదు: రోహిత్ శర్మ
యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వన్డేల్లో నాలుగో స్థానంలో ఏ ఆటగాడు కూడా స్థిరంగా కొనసాగలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు నెలల్లో వన్డే ప్రపంచ కప్ (World Cup 2023) ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా దేశాలు ప్రపంచ కప్లో ఆడే ఆటగాళ్లపై ఓ అంచనాకు వచ్చేశాయి. సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడనున్న భారత జట్టు (Team India)లో కచ్చితంగా ఈ ఆటగాళ్లుంటారని చెప్పలేని పరిస్థితి. 2019 ప్రపంచకప్ మాదిరిగానే ఈసారి కూడా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడిపై స్పష్టత లేదు. కొన్నాళ్లు ఈ స్థానంలో ఆడి మంచి ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరమై ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు వన్డే ప్రపంచకప్లో ఆడతాడా లేదా అని ఇప్పుడు చెప్పలేం. తాజాగా ఈ అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుంచి వన్డేల్లో నాలుగో స్థానంలో ఏ బ్యాటర్ కూడా స్థిరంగా కొనసాగలేదని రోహిత్పేర్కొన్నాడు.
రోహిత్ రికార్డుకు కార్ నంబర్కు లింక్.. ఇంతకీ అదేంటంటే?
‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానం మమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందిపెడుతోంది. యువీ (యువరాజ్ సింగ్) తర్వాత ఎవరూ ఈ స్థానంలో స్థిరంగా లేరు. చాలా గ్యాప్ తర్వాత ఈ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ భర్తీ చేశాడు. అతడు చాలా బాగా ఆడాడు. మంచి స్కోర్లు సాధించాడు. దురదృష్టవశాత్తు శ్రేయస్ గాయాలబారినపడి ఇబ్బంది పడ్డాడు. కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. గత 4-5 సంవత్సరాలలో చాలామంది ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. దీంతో ఆ స్థానంలో ఎప్పుడూ కొత్త ఆటగాడిని పంపాల్సి వచ్చింది’’ అని రోహిత్ వివరించాడు.
ప్రస్తుతం హార్దిక్ పాండ్య నాయకత్వంలో టీమ్ఇండియా.. విండీస్తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. మొదటి రెండు టీ20ల్లో విండీస్ గెలుపొందగా.. మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. నాలుగో టీ20 శనివారం జరగనుంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే సిరీస్ టీమ్ఇండియా వశమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rohit - Yuvaraj: రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్