Sunil Gavaskar : వరల్డ్కప్ ఓటమి నుంచి బయటపడేందుకు రోహిత్కు ఇదో మంచి అవకాశం : గావస్కర్
దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకూ టీమ్ఇండియా టెస్టు సిరీస్ నెగ్గింది లేదు. దీంతో ఆ లోటు తీర్చేందుకు రోహిత్ శర్మ(Rohit Sharma) ముందు మంచి అవకాశం ఉందని గావస్కర్(Sunil Gavaskar) పేర్కొన్నాడు.
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023)లో టీమ్ఇండియాను రోహిత్ శర్మ(Rohit Sharma) అద్భుతంగా నడిపించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమిపాలైనప్పటికీ.. టోర్నీ మొత్తం టీమ్ఇండియాదే (Team India) ఆధిపత్యం. అయితే.. చివరి మెట్టుపై బోల్తాపడటం ఆటగాళ్లతో పాటు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ ఓటమి నుంచి బయటపడేందుకు రోహిత్కు దక్షిణాఫ్రికా సిరీస్ (SA vs IND) రూపంలో మరో అవకాశం వచ్చిందని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) అన్నాడు.
ఇప్పటి వరకూ టీమ్ఇండియా దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేదు. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్ కేవలం.. టెస్టు సిరీస్కు మాత్రమే సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆ సిరీస్ను నెగ్గాలని గావస్కర్ ఆకాంక్షించాడు.
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గత 6-8 నెలల నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. కలీస్ చెప్పినట్లు.. రోహిత్ ఈ టెస్టు సిరీస్లో కీలక ఆటగాడిగా మారతాడు. జట్టులో నంబర్ 3, 4, 5 స్థానాలను సెట్ చేయడానికి పెద్ద పాత్ర పోషించాలి. ఏదీ ఏమైనప్పటికీ.. ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని భర్తీ చేసేందుకు రోహిత్కు ఇది చక్కటి అవకాశం’ అని గావస్కర్ ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ విశ్లేషించాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్లను వారి సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్ విజయాలను దక్కించుకున్న టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా గడ్డపై మాత్రం తడబడుతోంది. ఇప్పటి వరకు అక్కడ భారత్ ఒక్క టెస్టు సిరీస్ను కూడా కైవసం చేసుకోలేదు. ఈసారి రోహిత్ సేనకు చరిత్రను తిరగరాసే ఛాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) టీమ్ఇండియాకు మద్దతుగా నిలిచాడు. దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై ఓడిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ పేరు భారతదేశ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నాడు.
వన్డే ప్రపంచకప్ అనంతరం రోహిత్ వైట్ బాల్ ఫార్మాట్ నుంచి కాస్త విరామం తీసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సూర్యకుమార్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. వన్డేలకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. టెస్టు సిరీస్ను రోహిత్ నేతృత్వంలోనే టీమ్ఇండియా ఆడనుంది. మరోవైపు, ఇరు దేశాల మధ్య తొలి టీ20 వర్షార్పణం కాగా.. నేడు రెండో టీ20 కోసం టీమ్ఇండియా సిద్ధమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు