Ruturaj & Ishan: రుతురాజ్‌ - ఇషాన్‌.. అది మంచి పద్ధతి కాదయ్యా.. నెట్టింట్లో ట్రోలింగ్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ తొమ్మిది పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలుత సఫారీల జట్టు  40 ఓవర్లకు 249/4 స్కోరు చేయగా.. అనంతరం టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Updated : 07 Oct 2022 13:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో వర్షం కారణంగా బ్యాటింగ్‌ చేసేందుకు ఇబ్బందిగా మారిన పిచ్‌పై.. టీమ్‌ఇండియా అరంగేట్రం బ్యాటర్ రుతురాజ్‌ గైక్వాడ్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ మరీ నెమ్మదిగా ఆడటం విమర్శలకు దారితీసింది. నెట్టింట్లో ట్రోలింగ్‌ మొదలైంది. భారత టీ20 లీగ్‌లో అదరగొట్టే గైక్వాడ్‌.. జాతీయ జట్టు తరఫున జిడ్డుగా బ్యాటింగ్‌ చేయడంపైనా మీమ్స్‌, జోకులు పేలుతున్నాయి. 

పరుగుల ఖాతాను తెరిచేందుకే పది బంతులను తీసుకొన్న రుతురాజ్‌.. తర్వాత కూడా ధాటిగా ఆడలేకపోయాడు. చివరికి 42 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మరో బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ కూడా 37 బంతులను ఎదుర్కొని 20 పరుగులు మాత్రమే చేయడంతో చివర్లో లక్ష్య ఛేదన రన్‌రేట్‌ పెరిగిపోయిందని అభిమానులు విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ తమ స్థానాలను సురక్షితంగా ఉంచుకునేందుకు మాత్రమే ఆడారని, స్వార్థపూరితంగా బ్యాటింగ్‌ చేశారని నెటిజన్లు మండిపడ్డారు. ‘భారత భావి ఓపెనర్లు వీరే’.. అంటూ మరొక అభిమాని వ్యంగ్యంగా స్పందించాడు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని