Sanju Samson: సెంచరీ చేయడం గర్వంగానే ఉంది.. జట్టు గెలవడమే మరింత ఆనందం: సంజూ
దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ను భారత్ (SA vs IND) నెగ్గడంలో సంజూ శాంసన్ అద్భుత శతకం కూడా కీలకమే. సఫారీ జట్టుపై మూడో వన్డేలో సెంచరీతో సంజూ అలరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే కెరీర్లో భారత ఆటగాడు సంజూ శాంసన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై (SA vs IND) సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా సంజూ, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అర్ష్దీప్ దక్కించుకున్నారు. చాలా రోజుల తర్వాత వన్డేల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజూపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడాడు.
‘‘ఎంతో గర్వంగా ఉంది. ఎమోషనల్గానూ ఉంది. మరీ ముఖ్యంగా కీలకమైన మ్యాచ్లో సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది. మానసికంగా, శారీరకంగా చాలా రోజులు పడిన కష్టానికి ఫలితమిది. ఈ ఫార్మాట్లో క్రీజ్లో కుదురుకోవడానికి కాస్త సమయం ఉంటుంది. పిచ్ను అర్థం చేసుకోవడానికి.. బౌలర్ల మైండ్సెట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా టాప్ ఆర్డర్లో రావడం వల్ల అదనంగా 10-20 బంతులు తీసుకోవడానికి వీలవుతుంది. యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. దేశమంతా అతడి ఆటతీరు పట్ల గర్వపడుతోంది. సీనియర్లు రూపొందించిన ప్రమాణాలను యువ క్రికెటర్లు అందిపుచ్చుకున్నారు. ప్రతి రెండు రోజులకు ప్రయాణిస్తూ మ్యాచ్లు ఆడటం కఠిన సవాల్. అయినా యువ క్రికెటర్లు అదరగొట్టారు’’ అని సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు.
ఎల్బీ లేదా బౌల్డ్.. ఇదే మా ప్లాన్: అర్ష్దీప్
మూడు వన్డేల సిరీస్లో అర్ష్దీప్ సింగ్ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్లో ఒక వికెట్ మాత్రమే తీసినా.. రెండో వన్డేలో ఐదు, చివరి మ్యాచ్లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ‘‘రోజంతా పిచ్లో మార్పులేదు. మా ప్రణాళిక చాలా సింపుల్. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం. ఎల్బీగా పెవిలియన్కు చేర్చాలి లేదా బౌల్డ్ చేయాలనేది మా ప్లానింగ్. అది వర్కౌట్ అయింది. ఐపీఎల్ మాలాంటి కుర్రాళ్లకు అద్భుతమైన వేదిక. అంతర్జాతీయ క్రికెట్కు, ఐపీఎల్కు పెద్ద వ్యత్యాసం లేదు. అంతర్జాతీయ క్రికెటర్లను అర్థం చేసుకుంటే చాలు సులువుగా అడ్డుకోవచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం’’ అని అర్ష్దీప్ వెల్లడించాడు.
మ్యాచ్కు సంబంధించి మరిన్ని విశేషాలు..
- ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక వన్డేలు గెలిచిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఈ సంవత్సరం టీమ్ఇండియా 27 వన్డేల్లో విజయం సాధించింది. 30 వన్డేల విజయాలతో ఆస్ట్రేలియా ముందుంది.
- దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీసును భారత్ సొంతం చేసుకోవడం ఇది రెండోసారి మాత్రమే. చివరి సారిగా 2017-18 సీజన్లో 5-1 తేడాతో సిరీస్ను టీమ్ఇండియా గెలుచుకుంది.
- వన్డేల్లో సౌతాఫ్రికాపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు అర్ష్దీప్ సింగ్ పేరిట నమోదయ్యాయి. రెండో వన్డేలో 5/37 బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు మూడో మ్యాచ్లోనూ 4/30 గణాంకాలు నమోదు చేయడం విశేషం.
- దక్షిణాఫ్రికాపై వన్డేల్లో రెండుసార్లు 4+ వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ అర్ష్దీప్. అతడి కంటే ముందు చాహల్ మూడుసార్లు ఈ ఫీట్ను సాధించాడు. ఒకే సిరీస్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ కూడా అర్ష్దీప్. ఈ సిరీస్లో 10 వికెట్లు తీశాడు. మాజీ బౌలర్ మునాఫ్ పటేల్ 2010/11 సిరీస్లో 11 వికెట్లు పడగొట్టాడు.
- నాలుగో వికెట్ అంతకంటే దిగువన దక్షిణాఫ్రికాపై అత్యుత్తమ రెండో భాగస్వామ్యం సంజూ శాంసన్- తిలక్ వర్మదే (116). వీరి కంటే ముందు విరాట్ కోహ్లీ - సురేశ్ రైనా (2015లో 127 పరుగులు) జోడీ ఉంది.
- సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు ఇన్నింగ్స్ల్లో 238 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో భారత్ నమోదు చేసిన నాలుగో అత్యధిక స్కోరు(296/8) ఇదే. అంతకుముందు కెన్యాపై 2001లో పార్ల్ మైదానం వేదికగా 351/3 స్కోరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM