Team India : జూన్‌లో ఐర్లాండ్‌ పర్యటనకు టీమిండియా

భారత జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌ జట్టుతో రెండు టీ20 మ్యాచులు ఆడనుంది. ఈ మేరకు క్రికెట్‌ ఐర్లాండ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది...

Published : 02 Mar 2022 23:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌ జట్టుతో రెండు టీ20 మ్యాచులు ఆడనుంది. ఈ మేరకు క్రికెట్‌ ఐర్లాండ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. మలహైడ్ వేదికగా జూన్ 26న తొలి టీ20, 28న రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్ బుమ్రా తదితరులు ఈ సిరీస్‌లో ఆడనున్నారు.

‘‘ఈ సమ్మర్‌ ‘సీజన్ ఆఫ్‌ స్టార్స్‌’గా మారనుంది. ఎందుకంటే.. భారత్‌, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌ వంటి జట్లు ఐర్లాండ్‌లో పర్యటించనున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద పెద్ద జట్లకు ఐర్లాండ్‌ ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉంది. మేమూ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నాం’’ అని క్రికెట్‌ ఐర్లాండ్‌ ట్వీట్ చేసింది. 2018లో ఐర్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ సిరీస్‌ ముగిసిన వెంటనే టీమిండియా అటునుంచటే ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన ఆఖరి టెస్టు మ్యాచులో ఆడనుంది. జులై 1 నుంచి 5 వరకు ఈ టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాత అదే జట్టుతో జులై 7 నుంచి మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని