Shreyas - Dravid : రాహుల్ సర్ నాకు చెప్పింది అదే: శ్రేయస్ అయ్యర్
న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం సాధించి...
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం సాధించి భారత్ మంచి స్కోరు (345) సాధించడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. టీమ్ఇండియా బౌలర్లు రాణించడంతో కివీస్ను 296 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్కు 49 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయితే కివీస్ బౌలర్లు జేమీసన్, సౌథీ దెబ్బకు 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే శ్రేయస్ అయ్యర్ (65) మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధశతకంతో మెరిశాడు.
ఈ క్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన విషయాలను శ్రేయస్ వెల్లడించాడు. ‘‘ఎలాగైనా విజయం సాధించాలి. శతకం, అర్ధశతకం కంటే అదే ముఖ్యమైంది. రాహుల్ సర్ కూడా అధిక సమయం క్రీజ్లో నిలదొక్కుకోవాలని సూచించారు. మిడిలార్డర్లో పరుగులు రాబట్టేలా భాగస్వాయమ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. అందుకే సెషన్కు సెషన్కు వీలైనన్ని బంతులు ఆడాలని నిర్ణయించుకున్నా. ముందు జరగబోయే దాని గురించి ఆలోచించకుండా.. ఇప్పుడు ఏం చేయాలనేదానిమీదే దృష్టి పెడుతున్నా’’ అని వివరించాడు. తాము కనీసం 275-280 పరుగులను లక్ష్యంగా నిర్దేశించాలని భావించామని చెప్పాడు. భారత స్పిన్నర్ల మీద నమ్మకం ఉందని, ఆఖరి రోజు కివీస్ను ఒత్తిడిలోకి నెట్టేస్తామని పేర్కొన్నాడు. ఇంతకుముందు కూడానూ ఇలాంటి కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అయితే టీమ్ఇండియా తరఫున కాకుండా రంజీల్లో అనుభవించినట్లు వివరించాడు. ఒకే టెస్టులో శతకం, అర్ధశతకం సాధించిన శ్రేయస్కు ఆటగాళ్లు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.
రెండో ఇన్నింగ్స్లో శ్రేయస్తోపాటు సాహా (61*), అశ్విన్ (32), అక్షర్ (28*) రాణించడంతో భారత్ 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో మొత్తం 283 పరుగుల ఆధిక్యం సాధించిన టీమ్ఇండియా కివీస్కు భారీ లక్ష్యాన్ని (284) నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. అశ్విన్ బౌలింగ్లో విల్ యంగ్ (2) ఔటయ్యాడు. ఆఖరి రోజు కివీస్ విజయానికి 280 పరుగులు.. భారత్కు 9 వికెట్లు కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!