Team India: శ్రేయస్ గాయంతో భారత్ జట్టుకు సమస్యలు మొదలు
భారత్(Team India)కు బ్యాటింగ్లో బలమైన రిజర్వు ఆటగాళ్లు ఉండటంతో ఇప్పుడు తుది జట్టులోకి ఎంపిక సవాలుగా మారనుంది. శ్రేయస్ గాయం కారణంగా ఖాళీ అయిన స్థానంలోకి సూర్యకుమార్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: ఆసీస్తో టెస్ట్ సిరీస్కు ముందు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయపడటంతో భారత్(Team India)కు సమస్యలు మొదలయ్యాయని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఈ నెల 9వ తేదీ నుంచి నాగ్పుర్లో భారత్ సేన ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ మాట్లాడుతూ ‘‘శ్రేయస్ అయ్యర్ గాయం మరో సమస్యను సృష్టించింది. అతడి స్థానంలో ఎవరిని ఆడించాలన్నది భారత్(Team India)కు ఓ సవాల్. 5వ స్థానంలో సరిపోయే ఆటగాడు ఎవరైనా రిజర్వులో ఉన్నారా అంటే.. అది సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav). శుభ్మన్ గిల్(Shubman Gill), రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్(KL Rahul) ఓపెనర్లు. వీరిలో రోహిత్తో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు..? గతంలో జట్టు ఎంపికను గమనిస్తే.. ద్విశతకం చేసిన ఇషాన్ కిషన్ను వారు రిజర్వులో కూర్చోబెట్టారు. ఈ లెక్కన శుభమన్ గిల్ బాగా ఆడుతున్నా.. కేఎల్ రాహుల్ ఓపెనర్గా వెళ్లే అవకాశాలున్నాయి’’ అని చోప్రా వివరించాడు.
‘‘శుభ్మన్ (Shubman Gill) కేసు బలమైంది. ఎందుకంటే అతడు బంగ్లాదేశ్ సిరీస్ నుంచి పరుగులు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే 2023లో అతడిలా పరుగుల వరద పారించినవారు లేరు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్కు టెస్ట్ క్యాప్ ఇవ్వొచ్చని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. వెన్నెముక గాయం కారణంగా శ్రేయస్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడు ఇప్పటికీ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్కు శ్రేయస్ అందుబాటులో లేడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!