Aiden Markram: ధోనీ అపార జ్ఞాని.. దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో చూడాలనేదే నా కోరిక: మార్క్రమ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లోని కొత్త సారథిగా ఎదెన్ మార్క్రమ్ (Aiden Markram) సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నియమించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి (Sunrisers Hyderabad) కెప్టెన్గా ఎదెన్ మార్క్రమ్ (Aiden Markram) ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సారథిగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ జట్టును విజేతగా నిలపడంతో.. ఎస్ఆర్హెచ్ కూడా తన ఫ్రాంచైజీకి అతడినే కెప్టెన్గా నియమిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా నియామకం కావడంపై మార్క్రమ్ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా టీమ్ఇండియా మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) అద్భుత జ్ఞానసంపన్నుడని కొనియాడాడు. అతడి సారథ్య శైలి ప్రత్యేకమైందని ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్లోకి (SA T20) భారత్ నుంచి ఎవరినైనా తీసుకురావాలని భావిస్తే మాత్రం తప్పకుండా తాను ఎంఎస్ ధోనీ వైపే మొగ్గుచూపుతానని తెలిపాడు. అతడి అనుభవం యువ క్రికెటర్లకు దిక్సూచిగా పని చేస్తుందని పేర్కొన్నాడు.
‘‘ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజ క్రికెటర్ తమ శిబిరంలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అతడి అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ధోనీ నుంచి యువ క్రికెటర్లు ప్రయోజనం పొందుతారు. అంతర్జాతీయంగా చాలామంది ప్లేయర్లు ఉన్నప్పటికీ.. నా మనస్సులో ధోనీ మాత్రమే ఉన్నాడు’’ అని తెలిపాడు. ఎంఎస్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో ఆడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
వారిద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా..
డేవిడ్ వార్నర్ (Warner), కేన్ విలియమ్సన్ (Kane Williamson) తర్వాత హైదరాబాద్ పగ్గాలను దక్కించుకొన్న విదేశీ క్రికెటర్ మార్క్రమ్. గత రెండు సీజన్లలో ఎస్ఆర్హెచ్ దారుణమైన ప్రదర్శనతో విఫలమైంది. దీంతో మార్క్రమ్ నాయకత్వంలో ఉత్తమ ఫలితాలను సాధించాలని సన్రైజర్స్ భావిస్తోంది. మార్క్రమ్ కూడా తన శాయశక్తులా జట్టును విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ‘‘క్రీడాకారుడిగా విజయం సాధించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. ఇక బాధ్యతలు ఉంటే దానిని ఆస్వాదిస్తూ చేయడం నాకిష్టం. తమ జట్టు బాగా ఆడాలని ప్రతి అభిమాని కోరుకుంటూ ఉంటాడు. వారిని ఆనందంగా ఉంచడానికి శాయశక్తులా కష్టపడతా. జట్టుగా రాణిస్తే తప్పకుండా ఫలితాలు అనుకూలంగా వస్తాయి. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుగా సారథిగా వ్యవహరించిన డుప్లెసిస్తోపాటు (Faf du Plessis) కేన్ విలియమ్సన్ నాయకత్వం నుంచి నేర్చుకుంటా. వీరిద్దరూ నిశ్శబ్దంగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు. కేన్, ఫాఫ్తో కలిసి ఆడటం నాకు సానుకూలాంశం’’ అని మార్క్రమ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.