RSA vs ENG: చెలరేగిన సఫారీలు.. ఇంగ్లాండ్ ఎదుట కొండంత లక్ష్యం
ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్డెస్క్: వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. క్లాసేన్ (109; 67 బంతుల్లో 12×4,4×6) శతకంతో చెలరేగాడు. హెన్రిక్స్ (85; 75 బంతుల్లో 9×4, 3×6), డస్సేన్ (60; 61 బంతుల్లో 8×4) అర్ధశతకాలు సాధించారు. జాన్సేన్ (75*; 42 బంతుల్లో 3×4,6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లే 3 వికెట్లు పడగొట్టగా.. అదిల్ రషీద్ , అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డీకాక్ (4) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. టాప్లే బౌలింగ్లో జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి డౌన్లో వచ్చిన డస్సేన్తో కలిసి మరో ఓపెనర్ హెన్రిక్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 125 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రషీద్ విడగొట్టాడు. 19.4వ బంతికి బయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి డస్సేన్ వెనుదిరిగాడు. రెండో డౌన్లో వచ్చిన మార్క్రమ్ (42) అర్ధశతకానికి చేరువలో టోప్లే బౌలింగ్లోనే బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చాడు.
క్లాసేన్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ను బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓవైపు హెన్రిక్స్, డేవిడ్ మిల్లర్ ఔటైనప్పటికీ రన్రేట్ ఏమాత్రం తగ్గనివ్వలేదు. అయితే, సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసేన్ను ఆట్కిన్సన్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత ఆట కాస్త నెమ్మదించింది. చివర్లో జాన్సేన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లాండ్ ఎదుట దక్షిణాఫ్రికా భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!