Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
టీమ్ఇండియా అరుదైన ఫీట్ సాధించింది. వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో భారత్ క్రికెట్ జట్టు ర్యాకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్డెస్క్: వరల్డ్ కప్ (ODI World Cup 2023) ముంగిట భారత్కు అన్నీ శుభశకునాలే. ఇటీవల ఆసియా కప్ గెలిచిన సంబరం మరువకముందే.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ అన్ని ఫార్మాట్లలో భారత్ టాపర్గా నిలిచింది. ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్ను ఘనంగా ప్రారంభించడమే కాకుండా.. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం 116 పాయింట్లతో టాప్ ర్యాంక్ను సాధించగా.. పాకిస్థాన్ (115), ఆస్ట్రేలియా (111) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసీస్తో సిరీస్ను నెగ్గితే వరల్డ్ కప్నకు అగ్రస్థానంతో బరిలోకి దిగే అవకాశం భారత్కు ఉంటుంది.
- ఇప్పటికే భారత్ టెస్టు, టీ20 ఫార్మాట్లో తొలి ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్తో బోర్డర్- గావస్కర్ సిరీస్ను గెలుచుకోవడం, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవడం, విండీస్తో టెస్టు సిరీస్ నెగ్గడంతో టెస్టుల్లో భారత్ (118 పాయింట్లు) మొదటి స్థానానికి చేరుకుంది. టీమ్ఇండియా తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియా (118), ఇంగ్లాండ్ (115) కొనసాగుతున్నాయి.
- గతేడాది టీ20 సెమీ ఫైనల్కు చేరుకోవడం, ద్వైపాక్షిక సిరీసుల్లోనూ ఉత్తమ ప్రదర్శన చేయడంతో టీ20ల్లోనూ భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. టీ20 ప్రపంచ కప్ 2021 నుంచి ఇప్పటి వరకు మొత్త 14 సిరీసుల్లో కేవలం ఒక్క సిరీస్ను మాత్రమే టీమ్ఇండియా చేజార్చుకుంది. దీంతో భారత్ (264 పాయింట్లు), ఇంగ్లాండ్ (261), పాకిస్థాన్ (254) టాప్ -3లో నిలిచాయి.
- ఇలా మూడు ఫార్మాట్లలో భారత్ అగ్రస్థానం చేరుకోవడం ఇదే తొలిసారి. భారత్ కంటే ముందు 2012లో దక్షిణాఫ్రికా ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత్ ఆ జాబితాలో చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్