రెండో రోజు మెరిసిన భారత్
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. 166/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజును ఆరంభించిన కంగారూలు 338 పరుగులకు ఆలౌటయ్యారు. తర్వాత టీమ్ఇండియా సైతం బ్యాటింగ్లో...
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 338
దీటుగా బదులిస్తోన్న రహానె సేన
సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. 166/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన కంగారూలు 338 పరుగులకు ఆలౌటయ్యారు. తర్వాత టీమ్ఇండియా బ్యాటింగ్లో మంచి ప్రదర్శనే చేసింది. దీంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 45 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కన్నా ఇంకా 242 పరుగుల వెనుకబడి ఉంది. ప్రస్తుతం పుజారా (9), తాత్కాలిక కెప్టెన్ రహానె (5) క్రీజులో ఉన్నారు. శనివారం వీరిద్దరూ ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది.
స్మిత్ శతకం..
అంతకుముందు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేన్ (91; 196 బంతుల్లో 11x4) త్రుటిలో శతకం చేజార్చుకున్నా.. స్టీవ్ స్మిత్ (131; 226 బంతుల్లో 16x4) ఆ అవకాశాన్ని వదులుకోలేదు. వీరిద్దరూ మూడో వికెట్కు 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 206 పరుగుల వద్ద జడ్డూ లబుషేన్ను ఔట్ చేసి రెండో రోజు వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. ఆపై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు పెవిలియన్ చేరినా స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. క్రీజులో పాతుకుపోయి టెస్టుల్లో 27వ శతకం సాధించాడు. చివరికి జడేజానే అతడిని రనౌట్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు తెరపడింది.
రోహిత్, గిల్ శుభారంభం..
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమ్ఇండియా ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభం చేశారు. గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ మ్యాచ్లో ఆడుతున్న రోహిత్ శర్మ (26; 77 బంతుల్లో 3x4, 1x6) సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (50; 101 బంతుల్లో 8x4)తో కలిసి తొలి వికెట్కు 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హేజిల్వుడ్ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. ఆపై గిల్ అర్ధశతకం బాదిన వెంటనే కమిన్స్ బౌలింగ్లో గ్రీన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 85 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో జోడీ కట్టిన పుజారా, రహనె మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చివరికి భారత్ 45 ఓవర్లలో 96/2తో నిలిచి రెండో రోజును ముగించింది.
ఇవీ చదవండి..
నాలుగో టెస్టుపై నీలి నీడలు..
కోహ్లీ సరసన స్మిత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్