Asia Cup 2023: చెలరేగిన రోహిత్, గిల్.. నేపాల్ను చిత్తుచేసి సూపర్-4కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్లో భాగంగా నేపాల్ జరిగిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-4కు దూసుకెళ్లింది. వర్షం అంతరాయం వల్ల మ్యాచ్ను 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. రోహిత్ శర్మ(74*), శుభుమన్ గిల్(67*) అర్ధశతకాలతో చెలరేగి వికెట్ కోల్పోకుండా భారత్ను గెలిపించారు.
పల్లెకెలె: ఆసియా కప్లో భాగంగా పసికూన నేపాల్ను ఓడించి భారత్ సూపర్-4కు దూసుకెళ్లింది. వర్షం కారణంగా 23 ఓవర్లలో 145 పరుగులకు కుదించిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ లక్ష్యఛేదనలో 2.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గిన అనంతరం డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్దేశించారు. రోహిత్ శర్మ (74*), శుభ్మన్ గిల్ (67*) దంచికొట్టడంతో ఈ టార్గెట్ని టీమ్ఇండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. ఊహించిన దాని కంటే మంచి స్కోరే సాధించింది. వర్షం అంతరాయం నడుమ ఆ జట్టు 48.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కుశాల్ బార్టెల్ (38; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), అసిఫ్ షేక్ (58; 97 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ సోమ్పాల్ (48; 56 బంతుల్లో) కూడా మెరిశాడు. గుల్షాన్ జా (23), దీపేంద్ర సింగ్ (29) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. 146 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన నేపాల్.. 180లోపే ఆలౌటయ్యే కనిపించింది. కానీ, సోమ్పాల్ పట్టుదలగా ఆడటంతో పోరాడే స్కోరు సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిరాజ్ 3, షమి, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
భారత్ vs పాక్ మ్యాచ్ మళ్లీ..
గ్రూప్ ఎ నుంచి పాకిస్థాన్, భారత్ సూపర్-4 దశకు అర్హత సాధించడంతో ఈ ఇరుజట్లు మరోసారి తలపడనున్నాయి. సెప్టెంబరు 10న దాయాదుల పోరు ఉండనుంది. గ్రూప్ బిలో ఇంకా సూపర్-4 బెర్త్లు ఖరారు కాలేదు. మంగళవారం శ్రీలంక, అఫ్గానిస్థాన్ మ్యాచ్తో గ్రూప్ బిలో సూపర్-4 ఖరారు కానున్నాయి. ఈ గ్రూప్లో ప్రస్తుతం శ్రీలంక, బంగ్లాదేశ్ రెండేసి పాయింట్లతో పట్టికలో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంకపై అఫ్గాన్ గెలిస్తే మూడు జట్ల పాయింట్లు సమం అవుతాయి. అప్పుడు నెట్ రన్రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు ముందజ వేస్తాయి. ఇలా కాకుండా అఫ్గాన్ను శ్రీలంక ఓడిస్తే.. లంకతోపాటు బంగ్లాదేశ్ సూపర్-4కు వెళ్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!