INDvsENG: రెండో టెస్టుకు సిద్ధంగా ఉండమన్నారు.. అంతలోనే అలా జరిగింది: అశ్విన్
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పేస్కు అనుకూలించే పిచ్పై భారత బౌలర్లు చెలరేగి ఐదో రోజు ఆతిథ్య జట్టును 120...
లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పేస్కు అనుకూలించే పిచ్పై భారత బౌలర్లు చెలరేగి ఐదో రోజు ఆతిథ్య జట్టును 120 పరుగులకే రెండో ఇన్నింగ్స్లో కుప్పకూల్చారు. దీంతో భారత్ అనూహ్య విజయం సాధించింది. అయితే, ఆ మ్యాచ్కు ముందు అక్కడి వాతావరణం వేడిగా ఉందని, తనని సిద్ధంగా ఉండమని చెప్పారని సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా వెల్లడించాడు. టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్తో తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యుల చేశాడు. మ్యాచ్కు ముందు లార్డ్స్లో వాతావరణం వేడిగా ఉందని, దీంతో తుది జట్టులో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అంతకుముందే జట్టు యాజమాన్యం తనతో చెప్పిందని అశ్విన్ వివరించాడు. కానీ, ఒక్కసారిగా మ్యాచ్ ప్రారంభమయ్యే రోజు ఉదయం అనుకోకుండా వర్షం కురవడంతో తుది జట్టు నుంచి తప్పించారని తెలిపారు. అలా రెండో టెస్టులో తాను ఆడకపోవడానికి వాతావరణమే కీలక పాత్ర పోషించిందని చెప్పాడు.
అనంతరం ఇదే విషయంపై స్పందించిన శ్రీధర్.. టీమ్ఇండియాకు మేటి బౌలింగ్ యూనిట్ ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచపు అత్యుత్తమ స్పిన్నర్ను తుది జట్టులోకి తీసుకోకపోవడం అంత తేలిక కాదన్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ల గురించి మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నారు. రాహుల్ శతకంతో మెరవగా, రోహిత్ తనదైన డిఫెన్స్తో ఆకట్టుకున్నాడని మెచ్చుకున్నారు. చివరగా రెండో ఇన్నింగ్స్లో 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన టెయిలెండర్లు బుమ్రా, షమి మేటి ప్రదర్శన చేశారని ప్రశంసించారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 364 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 391 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్ 194 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన సందర్భంలో షమి(56), బుమ్రా(34) నాటౌట్గా నిలిచి ఎనిమిదో వికెట్కు 89 పరుగుల అత్యంత కీలక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ను 298/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా ఆపై ఇంగ్లాండ్ 120 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో భారత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగింది. అందులో పేసర్లే 19 వికెట్లు తీయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?