IPL 2021: ఇద్దరికీ చావో రేవో.. ఎవరు గెలుస్తారో చూడాలి!
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఇకపై ఆడాల్సిన తమ తమ రెండు మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాలి. ఈరోజు జరిగే 51వ మ్యాచ్లో ఈ రెండు జట్లూ పోటీపడుతుండగా...
రాజస్థాన్ x ముంబయి ప్రివ్యూ..
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఇకపై ఆడాల్సిన తమ తమ రెండు మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాలి. ఈరోజు జరిగే 51వ మ్యాచ్లో ఈ రెండు జట్లూ పోటీపడుతుండగా ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. గెలిచిన జట్టు ఒక అడుగు ముందుకేసి మరో మ్యాచ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనగా.. ఓడిన జట్టు నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అయితే, రాజస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉండగా.. ముంబయి మిగిలిన రెండు మ్యాచ్లు గెలవడంతో పాటు కోల్కతా, రాజస్థాన్ ఫలితంపైనా ఆధారపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
రెండు జట్లు ఇంచుమించు అంతే..
యూఏఈలో జరుగుతున్న రెండో దశలో ముంబయి, రాజస్థాన్ జట్లు ఇంచుమించు ఒకేలా ఆడుతున్నాయి. రాజస్థాన్ ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడు ఓటములు, రెండు విజయాలతో కొనసాగుతుండగా.. ముంబయి నాలుగు ఓటములు ఒక విజయంతో ప్లేఆఫ్స్ రేసులో కొట్టుమిట్టాడుతోంది. అయితే, గత మ్యాచ్లో రాజస్థాన్.. చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించడమే ఇప్పుడు ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశంగా ఉంది. బలమైన ధోనీసేనపై విజయం సాధించడంతో సంజూ టీమ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ముంబయి గతవారం పంజాబ్ను ఓడించి గెలుపు బాటపట్టినా.. శనివారం దిల్లీతో తలపడిన వేళ మరోసారి మట్టికరిచింది. దీంతో రోహిత్ శర్మ జట్టుపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి.
ముంబయి గెలవాలంటే..
ఈ సీజన్లో ముంబయి వైఫల్యానికి ప్రధాన కారణం బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోవడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. వన్డౌన్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ నుంచి లోయర్ మిడిల్ ఆర్డర్లో కీరన్ పొలార్డ్ వరకు ప్రతి ఒక్కరు బ్యాట్లకు పనిచెప్పలేక చతికిలపడ్డారు. అయితే, దిల్లీతో జరిగిన గత మ్యాచ్లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్య కాస్త లయ అందుకున్నట్లు కనిపించారు. మధ్యలో వారిద్దరు పరుగులు చేయడంతో ముంబయి 129 పరుగుల సాధారణ స్కోరైనా సాధించింది. మరోవైపు బౌలింగ్లో పేసర్లు బుమ్రా, కౌల్టర్ నైల్, ట్రెంట్ బౌల్ట్ లాంటి ఆటగాళ్లు ఫర్వాలేదనిపిస్తున్నా కీలక స్పిన్నర్లుగా కొనసాగుతున్న కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్ వికెట్లు తీయలేక సతమతమవుతున్నారు. వీళ్లంతా జట్టుగా రాణిస్తే తప్ప ముంబయి నేటి మ్యాచ్లో రాజస్థాన్ను ఓడించే పరిస్థితి లేదు.
రాజస్థాన్ నిలవాలంటే..
ఇక రాజస్థాన్ జట్టులో ప్రస్తుతం బ్యాట్స్మెన్ అంతా ఫామ్లో ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైతో తలపడిన గత మ్యాచ్లో ఆ జట్టు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైశ్వాల్ పూర్తి సానుకూల దృక్పథంతో కనిపిస్తున్నారు. వీరిద్దరూ చెన్నైతో మ్యాచ్లో ఐదు ఓవర్లలోనే 75 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశారు. ఆపై కెప్టెన్ సంజూ శాంసన్, ఆల్రౌండర్ శివమ్ దూబె ధాటిగా ఆడుతున్నారు. ఈ నలుగురు మరోసారి చెలరేగితే ముంబయికి కష్టాలు తప్పవనే చెప్పాలి. ఇక బౌలింగ్లో రాహుల్ తెవాతియా, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహ్మాన్ మరింత కట్టుదిట్టంగా బంతులేస్తే ముంబయిని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఇప్పటివరకు ఇరు జట్లు మొత్తం 25 మ్యాచ్ల్లో తలపడగా రాజస్థాన్ 12, ముంబయి 13 మ్యాచ్లు గెలుపొందాయి. ఇక ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఇంటిముఖం పడుతారో వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..