Tokyo Olympics: ఏం జరిగిందో అర్థంకాలేదు: దీపికా కుమారి
టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ పోటీల్లో ఏదో ఒక పతకం సాధిస్తుందని ఆశించిన భారత అగ్రశ్రేణి ఆర్చరీ క్రీడాకారిణి దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్లో విఫలమై అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్డెస్క్: టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ పోటీల్లో ఏదో ఒక పతకం సాధిస్తుందని ఆశించిన భారత అగ్రశ్రేణి ఆర్చరీ క్రీడాకారిణి దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్లో విఫలమై అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తన ఓటమికి అధిక ఒత్తిడే కారణమని ఆమె పేర్కొంది. భవిష్యత్లో ఇలా కాకుండా కొత్త పద్ధతిలో ఒలింపిక్స్లో పాల్గొని మెరుగైన ఫలితాలను సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా, ఆదివారం పూర్తైన టోక్యో ఒలింపిక్స్లో దీపికా మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ పెయిర్ విభాగంలోనూ పోటీపడి కీలక సందర్భాల్లో బోల్తాకొట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన వైఫల్యానికి గల కారణాలతో పాటు తన అనుభవాలు కూడా మీడియాతో పంచుకుంది. తాను పోటీల్లో పాల్గొన్నప్పుడు ఉన్నట్టుండి ఏం జరిగిందో కూడా అర్థంకాలేదని చెప్పింది.
‘ప్రతి ఒక్కరూ మనకు పతకం రాలేదు.. రాలేదు అని అంటుంటారు. దాంతో మేం పతకం గురించి వెయ్యిసార్లు ఆలోచిస్తాం. దాని వల్ల మా మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. దాంతో ఒత్తిడి పెరిగి అది మా నైపుణ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది పక్కనపెడితే.. ఈ ఒలింపిక్స్లో నా ఆటతీరును ఒక అంచనా వేశాను. ఇప్పుడు దాన్ని మరో విధంగా చూస్తున్నాను. దాంతో మేం కొన్ని ప్రాథమిక విషయాలపై దృష్టిసారించాలని తెలిసొచ్చింది. మేం ఆడే విధానంలో మార్పులు చేసుకోవాలని అనిపించింది. మనం ప్రతి ఒక్క ఈవెంట్ను ఒకే విధంగా చూడాలి. అది ప్రపంచకప్ అయినా, ప్రపంచ ఛాంపియన్షిప్లైనా, లేదా ఒలింపిక్స్ అయినా. అన్నింటినీ ఒకేలా చూడాలి. కానీ, మనం ఒలింపిక్స్కు వచ్చేసరికే పతకం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అలా కాకుండా దాన్ని తేలిగ్గా తీసుకొని ఆటను మాత్రమే ఆస్వాదించాలి. మనకు ప్రపంచకప్, ప్రపంచ ఛాంపియన్షిప్పుల్లో పతకాలు ముఖ్యమే అయినా, వాటి గురించి పెద్దగా ఆలోచించం. అదే ఒలింపిక్స్కు వచ్చేసరికి ఎలాగైనా పతకం సాధించాలని బలంగా కోరుకుంటాం’ అని దీపికా వివరించింది.
ఈ క్రమంలోనే తాను పోటీల్లో పాల్గొనప్పుడు విశ్రాంతి సమయంలో ప్రశాంతంగా ఉండాలనుకున్నట్లు చెప్పింది. అయితే, ఆ సమయంలో ఉన్నట్టుండి అక్కడ ఏం జరిగిందో తనకు అర్థంకాలేదని దీపిక పేర్కొంది. ఆ సమయంలో ఆమె పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నానని, గురిచూసి బాణాలు విసురుతున్నా అవి లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని దీపికా స్పష్టం చేసింది. అదో అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయిందని చెప్పింది. దాంతో తానూ, తన కోచ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు ఆమె వెల్లడించింది. మరోవైపు తన భర్త అతాను దాస్ కూడా పురుషుల విభాగంలో విఫలమవడంతో దీపికా విచారం వ్యక్తం చేసింది. తమ ఇద్దరికి అప్పుడొక మానసిక నిపుణుడు అవసరం అయ్యుండేదని, తమని మాటలతో స్ఫూర్తి నింపే వ్యక్తి కావాల్సి ఉండేదని తెలిపింది. ఇక చివరగా ఈ ఒలింపిక్స్లో విజేతలుగా నిలిచిన వారికి దీపికా అభినందనలు తెలిపింది. నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడం గర్వకారణమని ప్రశంసించింది. తాను కూడా పతకం సాధించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.