Team India : 2021లో టీమ్ఇండియాను ఆదుకున్నది ఈ ఇద్దరే..!
టీమ్ఇండియా ఈ ఏడాది 2021ను ఘనంగా ముగించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మినహా దాదాపు అన్ని సిరీస్లు గెలుపొందింది...
ఇంటర్నెట్డెస్క్: టెస్టుల్లో టీమ్ఇండియా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మినహా దాదాపు అన్ని సిరీస్లు గెలుపొందింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో చారిత్రక బోర్డర్-గావస్కర్ సిరీస్ సాధించడం, ఆపై స్వదేశంలో ఇంగ్లాండ్ను మట్టికరిపించడం మర్చిపోలేని అనుభూతులు. అలాగే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ను దాని సొంత గడ్డపైనే 2-1 తేడాతో ఓడించడం కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్ అనంతరం భారత్లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను సైతం కోహ్లీసేన కైవసం చేసుకుంది. ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులోనే ఆకట్టుకుంది. దీంతో 2021కి ఘనంగా వీడ్కోలు పలికింది.
అయితే, ఈ విజయాల్లో ఇద్దరు క్రికెటర్లు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకరు హిట్మ్యాన్ రోహిత్ శర్మ కాగా, మరొకరు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. రోహిత్ ఈ ఏడాది మొత్తం 11 టెస్టులు ఆడి 906 పరుగులు చేశాడు. అందులో రెండు 2 శతకాలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. ఆ రెండు శతకాల్లో ఒకటి చెన్నైలో జరిగిన రెండో టెస్టులో 161 పరుగులు కాగా, రెండోది ఓవల్లో జరిగిన టెస్టులో 127 పరుగులు చేశాడు. ఇక అశ్విన్ ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఒక్క టెస్టూ ఆడకపోయినా టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు(54) తీశాడు. అశ్విన్ ఆడింది 9 టెస్టులే కావడం మరో విశేషం. దీంతో వీరిద్దరూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇకముందు కూడా ఇలాగే రాణిస్తూ మరింత మెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!