Australia: అద్భుత ప్రదర్శనతో సవాళ్లను వెనక్కినెట్టి.. అన్ని జట్లనూ ఓడించి..
ఆస్ట్రేలియా ఆరో సారి ప్రపంచకప్ అందుకుంది. ఆరు అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. అంతకుమించి.
ఆస్ట్రేలియా (Australia) ఆరో సారి ప్రపంచకప్ (Icc World Cup) అందుకుంది. ఆరు అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. అంతకుమించి. ఈ ఘనత వెనుక ఆసీస్ ఆటగాళ్ల కష్టం ఉంది. పట్టుదలతో ఒడుదొడుకులను దాటి.. అద్భుత ప్రదర్శనతో సవాళ్లను వెనక్కినెట్టి.. మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. కంగారూ జట్టు ఈ టోర్నీని ఆరంభించిన దానికి, ముగించిన దానికి పొంతనే లేదు. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటములే. భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa) చేతుల్లో పరాజయాలు చవిచూసింది. కానీ మూడో మ్యాచ్లో శ్రీలంక (Sri Lanka) పై విజయం తర్వాత ఆ జట్టు ఆగలేదు. గెలుపు రుచి చూసిన ఆసీస్.. కప్పు ముద్దాడే వరకూ విశ్రమించలేదు. వరుసగా పాకిస్థాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్లపై గెలిచి సెమీస్ చేరింది. ప్రపంచకప్ నాకౌట్లో తామెంత ప్రమాదకరమో చాటుతూ సెమీస్, ఫైనల్లో విజయాలు అందుకుంది. అంతే కాదు లీగ్ దశలో తనను ఓడించిన జట్లపైనే నాకౌట్లో గెలిచి లెక్క సరిచేస్తూ.. అసలైన విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో సెమీస్లో 213, భారత్తో ఫైనల్లో 241 పరుగుల లక్ష్యఛేదనలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆ జట్టు పట్టుదలగా నిలబడింది. చివరి వరకూ ఓటమిని ఒప్పుకోని వ్యక్తిత్వంతో, ఆఖరి బంతి వరకూ పోరాడే తత్వంతో విజయభేరి మోగించింది. ముఖ్యంగా అజేయంగా ఫైనల్ చేరిన భారత్పై నెగ్గి సగర్వంగా కప్పు అందుకుంది.
నాకౌట్ నిరాశ
ఐసీసీ ట్రోఫీల్లో నాకౌట్ గండం టీమ్ఇండియాను వెంటాడుతూనే ఉంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో భారత్ 9 సార్లు నాకౌట్లోనే నిష్క్రమించింది. ఇందులో 5 ఫైనళ్లు, 4 సెమీస్లున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో వరుసగా రెండు ఫైనల్లో (2021, 2023)నూ టీమ్ఇండియా ఓడింది. 2014 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్లోనూ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. రెండు సార్లు వన్డే ప్రపంచకప్ (2015, 2019), టీ20 ప్రపంచకప్ (2016, 2022)లో సెమీస్లోనే ఇంటి ముఖం పట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.