Viral Video: 40వేల అడుగుల ఎత్తులోను తగ్గని ఫిఫా క్రేజ్!
ప్రపచంలో జరిగే క్రీడల మెగా టోర్నీలో ఫిఫా వరల్డ్ కప్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కడున్నా మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్బాల్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. ప్రస్తుతం ఫుట్బాల్ మెగా టోర్నీ ఫిపా వరల్డ్కప్ 2022 జరుగుతోంది. తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు ఎంతో మంది అభిమానులు తహతహలాడిపోతుంటారు. కానీ, అందరికీ ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే టీవీ, కంప్యూటర్, మొబైల్.. తమకు అందుబాటులో ఉన్న మాధ్యమం ద్వారా మ్యాచ్లన వీక్షిస్తుంటారు. మరి, విమానంలో ప్రయాణించే వారి పరిస్థితి ఏంటి? ఈ సమస్యకు పరిష్కారంగా విమానయాన సంస్థలు మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. తాజాగా ఓ విమానంలో ఉన్న ప్రయాణికులందరూ స్క్రీన్లలో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే, ఈ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగింది, అది ఏ విమానయాన సంస్థ అనే వివరాలను మాత్రం ప్రస్తావించలేదు.
ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభమైనప్పటి నుంచి ఎతిహాద్, ఖతార్, జెట్ బ్లూ, సింగపూర్ ఎయిర్లైన్స్ సహా మరికొన్నిఅంతర్జాతీయ విమాయాన సంస్థలు ఫుట్బాల్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గాల్లో కూడా తమకు ఇష్టమైన ఆటను ఆస్వాదిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘40 వేల అడుగుల ఎత్తులోనూ ఫుట్బాల్కు తగ్గని క్రేజ్’, ‘ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానించే ఆట ఇదే’, ‘గోల్ కొట్టినప్పుడు విమానంలో పరిస్థితి ఊహించడం కష్టం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!