Virat Kohli: హీరోయిన్ను పెళ్లాడాలని విరాట్ అప్పుడే అనుకున్నాడా?
ఓ హీరోయిన్ను పెళ్లాడాలని చిన్నప్పుడే విరాట్ కోహ్లీ (Virat Kohli) అనుకున్నాడని, అతడి చిన్ననాటి స్నేహితుడి తల్లి నేహా సోంధి తెలిపారు. ఆర్సీబీ సోషల్ మీడియా విభాగం ఆమెను పలకరించగా.. కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్డెస్క్: విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలోనే సరికొత్త ట్రెండ్. అతడు ఏది చేసినా ప్రత్యేకమే. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. బయట కూడా అంతే చలాకీ. ఇతరులను అభినందించాలన్నా.. తన అసహనాన్ని వెలిబుచ్చాలన్నా అతడికి అతడే సాటి. బాలీవుట్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న తర్వాత ఈ జోడీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఓ ఐకాన్గా మారిన ఈ జంట గత డిసెంబరులోనే 5 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆర్సీబీ సోషల్ మీడియా విభాగం.. కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అతడి చిన్ననాటి స్నేహితుడి తల్లిని, ఆయనకు క్రికెట్ మెళకువలు రాజ్కుమార్ శర్మను పలకరించింది.
చిన్నప్పుడు కోహ్లీ చాలా హుషారుగా ఉండేవాడని, ఓ పట్టాన ఎవరి మాటా వినేవాడు కాదని అతడి చిన్ననాటి స్నేహితుడు షల్ సోంధి తల్లి నేహా సోంధి అన్నారు. అతడి ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగా ఉండేవని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అప్పట్లో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు.‘‘ ఒక రోజు దిల్లీలోని మదన్లాల్ అకాడమీకి నేను, కోహ్లీ, షల్ వెళ్తున్నాం. అక్కడ ఓ భారీ పోస్టర్ కనిపించింది. అందులో ఒక హీరోయిన్ ఫోజులిస్తోంది. ఆ పోస్టర్ను చూసిన కోహ్లీ.. ఏదో ఒక రోజు నేను కూడా ఎదుగుతాను, మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. ఓ హీరోయిన్ను పెళ్లాడతాను అన్నాడు. అదృష్టం కొద్దీ అలాగే ఎదిగాడు. హీరోయిన్నే పెళ్లి చేసుకున్నాడు. చాలా గర్వంగా ఉంది’’ అంటూ నేహా సోంధి గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది.
కోహ్లీ, అతడి స్నేహితుడు షల్ సోంధి ఇద్దరూ రాజ్కుమార్ శర్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. అంతర్జాతీయ క్రికెటర్గా ఎదగాలని చిన్ననాటి నుంచే కోహ్లీ దృఢ సంకల్పంతో ఉండేవాడని, అందుకు తగ్గట్లుగా చాలా కఠినంగా ప్రాక్టీస్ చేసేవాడని రాజ్కుమార్ శర్మ గుర్తు చేసుకున్నారు. ‘‘అది 30 మే, 1998. కోహ్లీ తన తండ్రి, సోదరుడితో కలిసి నా దగ్గరికి వచ్చారు. అకాడమీలో చేరిన కొద్ది రోజులకే అందరిలోనూ కోహ్లీ ప్రత్యేకమని అర్థమైంది. చాలా చురుగ్గా ఉండేవాడు. కొంటె చేష్టలు చాలా ఎక్కువ. అలాగని నిబద్ధత కూడా ఎక్కువే. ఏదైనా పూర్తిగా నేర్చుకునే దాకా వదిలిపెట్టేవాడు కాదు. అకాడమీలో చేరిన తొలి రోజు నుంచే ఆటలో ఇతరులను డామినేట్ చేసేందుకు ప్రయత్నించేవాడు. నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం కోహ్లీలో పుష్కలంగా ఉంటాయి. అదే ఆయనకు ప్లస్ పాయింట్.’’ అని రాజ్కుమార్ శర్మ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే