Cricket News: కేన్ను నెట్టేసిన స్మిత్.. విరాట్@4
ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్స్మిత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వెనక్కి నెట్టాడు. ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగై నాలుగో ర్యాంకుకు...
దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్స్మిత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వెనక్కి నెట్టాడు. ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగై నాలుగో ర్యాంకుకు ఎగబాకాడు. పరుగులు చేయడంలో విఫలమైన ఇంగ్లాండ్ సారథి జో రూట్ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీసు ముగిసిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ (886 రేటింగ్) కేవలం 13 పరుగులే చేశాడు. గాయంతో రెండో టెస్టు ఆడలేదు. ఫలితంగా అతడి రేటింగ్ పాయింట్లలో కోత పడింది. 891 రేటింగ్తో స్టీవ్స్మిత్ తిరిగి నంబర్ వన్గా ఆవిర్భవించాడు. గ్యారీ సోబర్స్ (189 టెస్టులు), వివ్ రిచర్డ్స్ (179 టెస్టులు) తర్వాత ఎక్కువ మ్యాచులు 167 ఆడిన క్రికెటర్గా నిలిచాడు. పరుగులు చేయకుండా నిరాశ పరిచిన ఇంగ్లాండ్ సారథి జో రూట్ 797 రేటింగ్తో ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 814 రేటింగ్తో కొనసాగుతున్నాడు. రిషభ్ పంత్ (797), రోహిత్ శర్మ (797) సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు.
ఇంగ్లాండ్తో రెండో టెస్టులో ప్రతి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ 307 రేటింగ్తో 64వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ అజాజ్ పటేల్ కెరీర్ బెస్ట్ 323 రేటింగ్ సాధించాడు. డబుల్ సెంచరీ చేసిన డేవాన్ కాన్వే బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా 61వ స్థానంలో నిలిచాడు. ప్యాట్ కమిన్స్ (908), రవిచంద్రన్ అశ్విన్ (850), టిమ్ సౌథీ (830) టాప్-3 బౌలర్లుగా ఉన్నారు. కాగా టాప్-10లో యాష్ మినహా భారత్ నుంచి మరెవ్వరూ లేకపోవడం గమనార్హం. ఆల్రౌండర్ల జాబితాలో యాష్ 2, జడ్డూ 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..