వాన్..! మిమ్మల్ని మీరే కించపర్చుకుంటున్నారు
ఇంగ్లాండ్ను ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ కించపర్చుకుంటున్నాడని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వసీమ్ జాఫర్ తనదైనశైలిలో ఎగతాళి చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్ను ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ కించపర్చుతున్నాడని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వసీమ్ జాఫర్ తనదైనశైలిలో ఎగతాళి చేశాడు. గతరాత్రి ఇరు జట్ల మధ్య జరిగిన కీలకమైన నాలుగో టీ20లో కోహ్లీసేన 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమ్ఇండియా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 177/8 పరుగులకు పరిమితమైంది. దీంతో సిరీస్ 2-2తో సమానంగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఆడిన 11 మందిలో ముగ్గురు ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లుండటం విశేషం.
ఈ విషయాన్ని గుర్తించిన వాన్.. మ్యాచ్ అనంతరం ఓ ట్వీట్ చేశాడు. ‘ఇది గుర్తుకు వచ్చిన ఓ విషయం మాత్రమే. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(ముంబయి ఇండియన్స్), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య(ముంబయి ఇండియన్స్), యువ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్(ముంబయి ఇండియన్స్)’ అని పేర్కొంటూ ఆ ఫ్రాంఛైజీని ట్యాగ్ చేశాడు. కాగా, ఈ ముగ్గురూ టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ కాసేపు మైదానం వీడిన సమయంలో రోహిత్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్య బౌలింగ్లో జేసన్(40; 27 బంతుల్లో 6x4, 1x6) ఇచ్చిన క్యాచ్ను సూర్యకుమార్ ఒడిసిపట్టాడు. ఆపై శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో బెన్స్టోక్స్(46; 23 బంతుల్లో 4x4, 3x6) క్యాచ్ను కూడా సూర్యనే అందుకున్నాడు. తర్వాత పాండ్య.. సామ్కరన్(3)ను బౌల్డ్ చేశాడు. దీంతో పాండ్య నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయడమే కాకుండా 16 పరుగులే ఇచ్చి మంచి ప్రదర్శన చేశాడు. ఇక టీమ్ఇండియా బ్యాటింగ్లో సూర్యకుమార్(57; 31 బంతుల్లో 6x4, 3x6) అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ముగ్గురూ టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారని వాన్ పరోక్షంగా అభిప్రాయపడ్డాడు.
ఆ ట్వీట్కు జాఫర్ స్పందిస్తూ వాన్ పేరు ప్రస్తావించకుండానే ట్రోల్ చేశాడు. ‘జాతీయ జట్టుతో కాకుండా ఒక ఫ్రాంఛైజీ జట్టుతో మీ ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిందని చెప్పినప్పుడు.. మీరు ప్రత్యర్థిని ట్రోల్ చేయడం కాదు. మీ సొంత జట్టును మీరే ట్రోల్ చేసుకుంటున్నారని అర్థం’ అని జాఫర్ దీటుగా పేర్కొన్నాడు. కాగా, కొద్ది రోజుల క్రితం వాన్ ఇలాగే ఇంకో ట్వీట్ చేశాడు. టీమ్ఇండియా కన్నా ముంబయి ఇండియన్సే గొప్ప జట్టని తొలి టీ20 సందర్భంగా పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!