Rohit Sharma : ఆ ముగ్గురిని భవిష్యత్ నాయకులుగా తీర్చి దిద్దుతాం : రోహిత్ శర్మ
భారత జట్టుకు భవిష్యత్తులో సారథ్యం వహించే నాయకులను ఇప్పటి నుంచే తయారు చేస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్, సీనియర్ పేసర్..
ఇంటర్నెట్ డెస్క్ : భారత జట్టుకు భవిష్యత్తులో సారథ్యం వహించే నాయకులను ఇప్పటి నుంచే తయారు చేస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను భవిష్యత్తు కెప్టెన్లుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నాడు. శ్రీలంకతో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అతడు మాట్లాడాడు.
‘భవిష్యత్తు నాయకులను తయారు చేసే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మేం కూడా సీనియర్ల నుంచి నేర్చుకునే ఈ స్థాయికి వచ్చాం. అది సహజ ప్రక్రియ. మేం కూడా అదే పద్దతిలో కెప్టెన్లను సిద్ధం చేస్తాం. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, బుమ్రా.. ముగ్గురూ ఎంతో పరిణతితో ఆలోచించగల క్రికెటర్లు. వారికి అన్ని విషయాలు మనమే నేర్పించాల్సిన అవసరం లేదు. అయితే, క్లిష్ట పరిస్థితుల్లో వారికి మార్గనిర్దేశం చేయడానికి ఒకరు కావాలి. అయితే, టీమిండియా కోసం ఏం చేయాలో వారికి తెలుసు. భవిష్యత్తులో జట్టుని నడిపించే బాధ్యత వారిపై ఉంది. వాళ్లపై మరింత ఒత్తిడి తీసుకు రావాలనుకోవట్లేదు. మైదానంలో స్వేచ్ఛగా ఆడుతూ.. వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేలా చూస్తాం’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే, రోహిత్ని తీర్చి దిద్దిన ఆటగాడి పేరు అతడు పేర్కొనలేదు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న సమయంలోనే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను భవిష్యత్ కెప్టెన్లుగా తీర్చి దిద్దిన విషయం తెలిసిందే.
* సత్తా ఉంటే.. ఎవరినైనా ప్రోత్సహిస్తాం..
‘కెప్టెన్గా నియమించే ఆటగాడు బ్యాటరా? బౌలరా? అనే విషయంతో పని లేదు. సమర్థంగా జట్టుని నడిపించగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లను కచ్చితంగా ప్రోత్సహిస్తాం. జస్ప్రీత్ బుమ్రాను నేను చాలా దగ్గరి నుంచి గమనించాను. అతడి వ్యూహాలు చాలా గొప్పగా ఉంటాయి. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే.. జట్టుని మెరుగ్గా నడిపించగలడనే నమ్మకం ఉంది’ అని రోహిత్ శర్మ చెప్పాడు. శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్కు కేఎల్ రాహుల్ దూరం కావడంతో.. బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!