ద్రవిడ్పై సచిన్ అలిగిన వేళ..!
2004.. చిరకాల శత్రువు పాకిస్థాన్లో భారత్ అడుగుపెట్టి అప్పటికే 15 ఏళ్లు గడిచింది. అందుకే రెండు దేశాల క్రికెటర్లే కాదు అభిమానులు, రాజకీయ నాయకులూ అత్యంత ఉత్కంఠను అనుభవించారు. ఆ హోరాహోరీ సిరీసులో ద్విశతకం చేసే అవకాశం దొరికితే ఎవరు వదిలేస్తారు చెప్పండి! దాయాదిని సొంతగడ్డపై....
జట్టు రెండుగా చీలుతుందేమోనన్న ఆందోళన
ముల్తాన్ సుల్తాన్గా అవతరించిన వీరూ
2004.. చిరకాల శత్రువు పాకిస్థాన్లో భారత్ అడుగుపెట్టి అప్పటికే 15 ఏళ్లు గడిచింది. అందుకే రెండు దేశాల క్రికెటర్లే కాదు అభిమానులు, రాజకీయ నాయకులూ అత్యంత ఉత్కంఠను అనుభవించారు. ఆ హోరాహోరీ సిరీసులో ద్విశతకం చేసే అవకాశం దొరికితే ఎవరు వదిలేస్తారు చెప్పండి! దాయాదిని సొంతగడ్డపై ఓడించే ఆధిపత్యం లభిస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి! కానీ ఆ రెండు సందర్భాలు టీమ్ఇండియాకు ఏళ్ల తరబడి అండగా నిలిచిన సచిన్, ద్రవిడ్ మధ్య మనస్పర్ధలకు కారణమయ్యాయి. జట్టు రెండు వర్గాలుగా చీలిపోతుందేమోనన్న భయం కలిగింది. మరి ఆ విపత్కర పరిస్థితులు ఎలా చల్లబడ్డాయంటే..!
ముల్తాన్ ‘సుల్తాన్’
మూడు టెస్టుల సిరీసులో మొదటి మ్యాచుకు ముల్తాన్ వేదిక. సౌరవ్ గంగూలీ గాయపడటంతో రాహుల్ ద్రవిడ్ ఈ పోరుకు సారథ్యం వహించాడు. టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆకాశ్ చోప్రా, వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనింగ్కు దిగారు. సొంతగడ్డపై తమ బౌలింగ్కు తిరుగులేదన్న పాక్కు వీరేంద్రుడు చుక్కలు చూపించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో వేగానికి పెద్దపీట వేశాడు. 43 ఓవర్లకు టీమ్ఇండియా 173/2తో నిలిచింది. కానీ అప్పుడే మొదలైంది పరుగుల వరద. ముల్తాన్లో సెహ్వాగ్ సునామీ సృష్టించాడు. మొదట 107 బంతుల్లో 100తో మొదలుపెట్టాడు. ఆ తర్వాత 150 బంతుల్లో 150కి చేరువయ్యాడు. 222 బంతుల్లో 200 సాధించేశాడు. మరికాసేపటికే పాక్పై పాక్లో అత్యధిక పరుగులు చేసిన సంజయ్ మంజ్రేకర్ (221) రికార్డును తుడిచేశాడు. దాంతో తొలిరోజు టీమ్ఇండియా 356 పరుగులు చేసేసింది.
‘300’ వీరుడు
ఇక రెండోరోజూ వీరూది అదే జోరు. కుదిరిదే బౌండరీ.. లేదంటే సిక్సర్.. దంచికొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. 299 బంతుల్లో 250 మైలురాయి చేరుకున్నాడు. మరోవైపు సచిన్ 209 బంతుల్లో 100తో అండగా ఉన్నాడు. భోజన విరామానికి టీమ్ఇండియా 467/2తో వెళ్లింది. అప్పటికి వీరూ 292*, సచిన్ 106*తో నిలిచారు. భోజనం చేసి రాగానే సెహ్వాగ్ త్రిశతకం చేసేశాడు. 364 బంతుల్లో 300 చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. లక్ష్మణ్ 281 రికార్డును చెరిపేశాడు. సిక్సర్తో వీరూ త్రిశతకం అందుకోవడం ఔరా! అనిపించింది. ఆసీస్ విధ్వంసకర వీరుడు మాథ్యూ హెడేన్ రికార్డునూ తుడిచి పెడతాడునుకుంటే 309 వద్ద అతడిని మహ్మద్ సమి ఔట్చేశాడు. అప్పటికి భారత స్కోరు 509/3. ఈ క్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ (29) అండతో సచిన్ 150 దాటేశాడు. 565 వద్ద లక్ష్మణ్ ఔటవ్వడంతో యువరాజ్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు మొదలైంది అసలు కథ.
విస్తుపోయిన సచిన్
రెండో రోజు తేనీటి విరామానికి 148 ఓవర్లకు టీమ్ఇండియా 588/4తో నిలిచింది. సచిన్ 165*తో ఉన్నాడు. నిజానికి అప్పటికే డిక్లేర్ చేస్తే బాగుంటుందని కోచ్ జాన్రైట్ భావించాడు. కానీ పాకిస్థాన్ను మరికాసేపు ఫీల్డింగ్ చేయించి ఆఖరి 15-16 ఓవర్లు ఆడించాలన్నది ద్రవిడ్ ప్రణాళిక. సమయం మరీ ఎక్కువ లేకపోవడంతో వేగంగా ఆడాలన్న సందేశాలు సచిన్, యువీకి అందుతున్నాయి. అందుకు తగ్గట్టే వారూ వేగంగా ఆడుతున్నారు. 157.3 ఓవర్లకు భారత్ 650కి చేరుకుంది. యువరాజ్ 53 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. సచిన్ 190ని దాటేశాడు. మరో 3 ఓవర్లు.. మరో 2 ఓవర్లు అంటూ ద్రవిడ్ సందేశాలు పంపిస్తూనే ఉన్నాడు. 161 ఓవర్లు ముగిశాయి. సచిన్ 194 వద్ద ఉండగా ఇమ్రాన్ ఫర్హాత్ వేసిన తర్వాతి ఓవర్లో యువీ బ్యాటింగ్ చేశాడు. తొలి రెండు బంతులు డాట్ అయ్యాయి. మూడో బంతికి 2 పరుగులు తీశాడు. నాలుగో బంతికి పరుగు రాలేదు. దాంతో ఐదో బంతిని ఆడేందుకు ప్రయత్నించి బౌలర్కే క్యాచ్ ఇచ్చాడు. నిజానికి ఆ ఓవర్లో ఒక్క బంతీ ఆడకపోవడంతో తనకు మరో 6 బంతులైనా ఇస్తారేమోనని సచిన్ అనుకున్నాడు. ద్విశతకం చేయొచ్చన్నది అతడి భావన. కానీ యువీ వచ్చేస్తుండగా ద్రవిడ్ చేతులూపుతూ సచిన్నూ రమ్మనడంతో వివాదం చెలరేగింది.
భయపడ్డా..!
టీమ్ఇండియాకు సచిన్, ద్రవిడ్ వెన్నెముక లాంటివాళ్లు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి చక్కని భాగస్వామ్యాలు నిర్మించారు. అలాంటిది తన ద్విశతకానికి మరో ఓవర్ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యానని సచిన్ చెప్పాడు. అయితే మాస్టర్ అవమానకరంగా భావించాడని కోచ్ జాన్రైట్ కొన్నాళ్ల క్రితం తన ఆత్మకథలో ప్రస్తావించాడు. జట్టు రెండు వర్గాలుగా విడిపోతుందో ఏమోనని భయపడ్డామన్నాడు. పరిస్థితి వేడిగా ఉండటంతో సచిన్తో మాట్లాడి సర్దిచెప్పాలని ద్రవిడ్కు సూచించాడు. ద్రవిడ్ మాట్లాడినప్పుడు మైదానంలో ఎప్పటిలాగే ఉంటానని బయట మాత్రం కొంత ఒంటరిగా వదిలేయాలని సచిన్ చెప్పాడని తెలిసింది. ఆ తర్వాత మీడియాలో ఈ సంఘటనపై దుమార రేగడం గమనార్హం. తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లోనూ దీనిపై మాస్టర్ ప్రస్తావించాడు. ఆ సమయంలో బాధ కలిగినా తర్వాత టీమ్ఇండియా వాల్తో కలిసి ఎన్నో భాగస్వామ్యాలు పంచుకున్నానని, స్నేహం ఎప్పటిలాగే కొనసాగుతోందని రాశాడు. తాము గెలుపుపై పట్టుదలతో ఉన్నామని చెప్పేందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశానని, సహచరుల మధ్య అభిప్రాయభేదాలు సహజమేనని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ పరిస్థితి చల్లబడింది. టీమ్ఇండియా ఆ సిరీసు గెలిచి చరిత్ర సృష్టించింది.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..